Revanth Reddy: భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ భేటీ.. ఖమ్మం సభపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
Read Also: Spy: ‘స్పై’లో బన్నీ… ఎలివేషన్ మామూలుగా లేదుగా!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
దీంతో భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరానికి రేవంత్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి, మధుయాష్కి వచ్చారు. ఖమ్మం సభపై భట్టితో చర్చిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారాలు కూడా తెలుసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం నుంచే రాహుల్ గాంధీ సందేశం ఇవ్వబోతున్నారు అని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Read Also: Interview Tips : ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే జాబ్ వచ్చినట్లే..!!
ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్థేశించబోతుందని ఆయన వెల్లడించారు. పొంగులేటి చేరికతో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. చేరికలపై పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.. బీజేపీలో ఉన్న పరిస్థితి జితేంద్ రెడ్డి ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది అని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం 2014 నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే బలమైనదని తెలుస్తుందన్నారు.
Read Also: Manipur Violence: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?
పాట్నా మీటింగ్ కు దూరమైన కేసీఆర్.. కాంగ్రెస్ కు మిత్రుడు ఎలా అవుతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సొంత పార్టీ నేతలే.. బీఆర్ఎస్ తో బీజేపీ బంధం ఉన్నట్లు చెబుతున్నారు.. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బిత్తిరి సత్తి.. ఎప్పుడు ఏమీ మాట్లాడుతాడో తెలియదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మధుయాష్కి మాట్లాడుతూ.. దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్.. మొజంజాహి మార్కెట్లో గులాబీపూలు అమ్ముకునేవారు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!