Revanth Reddy: భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ భేటీ.. ఖమ్మం సభపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
Read Also: Spy: ‘స్పై’లో బన్నీ… ఎలివేషన్ మామూలుగా లేదుగా!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
దీంతో భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరానికి రేవంత్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి, మధుయాష్కి వచ్చారు. ఖమ్మం సభపై భట్టితో చర్చిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారాలు కూడా తెలుసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం నుంచే రాహుల్ గాంధీ సందేశం ఇవ్వబోతున్నారు అని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Read Also: Interview Tips : ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే జాబ్ వచ్చినట్లే..!!
ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్థేశించబోతుందని ఆయన వెల్లడించారు. పొంగులేటి చేరికతో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. చేరికలపై పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.. బీజేపీలో ఉన్న పరిస్థితి జితేంద్ రెడ్డి ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది అని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం 2014 నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే బలమైనదని తెలుస్తుందన్నారు.
Read Also: Manipur Violence: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?
పాట్నా మీటింగ్ కు దూరమైన కేసీఆర్.. కాంగ్రెస్ కు మిత్రుడు ఎలా అవుతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సొంత పార్టీ నేతలే.. బీఆర్ఎస్ తో బీజేపీ బంధం ఉన్నట్లు చెబుతున్నారు.. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బిత్తిరి సత్తి.. ఎప్పుడు ఏమీ మాట్లాడుతాడో తెలియదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మధుయాష్కి మాట్లాడుతూ.. దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్.. మొజంజాహి మార్కెట్లో గులాబీపూలు అమ్ముకునేవారు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!