Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today Business Headlines 03 05 23 Fastag Daily Toll Collection Hit Record High Of Rs 193 Crore On April 29

Today Business Headlines 03-05-23: ఫాస్టాగ్ ద్వారా ఒక్క రోజే రూ.193 కోట్లకు పైగా వసూలు. మరిన్ని వార్తలు

Published Date :May 3, 2023 , 1:04 pm
By Akkirala Kondala Rao
Today Business Headlines 03-05-23: ఫాస్టాగ్ ద్వారా ఒక్క రోజే రూ.193 కోట్లకు పైగా వసూలు. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today Business Headlines 03-05-23:

భోగాపురానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా, భవిష్యత్తులో ఏడాదికి కోటీ 80 లక్షల మంది రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.

గిగ్ వర్కర్లను ఆదుకుంటాం

గిగ్ వర్కర్లకు సరికొత్త విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఇ కామర్స్ సంస్థలు మరియు వారి సప్లయర్లతో సర్కారు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవటం ద్వారా గిగ్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. తాము రూపొందించబోయే విధానం దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని అన్నారు. తెలంగాణ అమలుచేస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనేది దీంతో మరోసారి రుజువు కావాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు.

రికార్డ్ లెవల్ టోల్ కలెక్షన్

నేషనల్ హైవేలు మరియు స్టేట్ హైవేలపై ప్రయాణించే వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌కి సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29వ తేదీన ఒకే రోజు 193 పాయింట్ ఒకటీ ఐదు కోట్ల రూపాయలు వసూలైనట్లు కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ తెలిపింది. ఆ రోజు జరిగిన లావాదేవీల సంఖ్య ఒకటీ పాయింట్ ఒకటీ ఆరు కోట్లు అని వెల్లడించింది. టోల్ ప్లాజాల సంఖ్య 770 నుంచి 12 వందల 28కి పెరిగాయని పేర్కొంది. ఇందులో 339 టోల్ ప్లాజాలు తెలంగాణ రాష్ట్ర రహదారుల్లో ఏర్పాటుచేసినవేనని స్పష్టం చేసింది.

హెచ్ఐవీ బాధిత పిల్లలకు

హెచ్ఐవీతో బాధపడే పిల్లలకు ట్రీట్మెంట్‌లో ఉపయోగించే డోలుటెగ్రావిర్ అనే మెడిసిన్‌కి తాత్కాలిక ఆమోదం లభించింది. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఈ పర్మిషన్ ఇచ్చినట్లు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 5 మిల్లీగ్రాములు, 10 మిల్లీగ్రాముల డోసులో ఈ మందు అందిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేసింది. ఈ ఔషధం వల్ల హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.

‘యూకో’ లాభం అదుర్స్

యూకో బ్యాంక్ గతంలో ఎన్నడూలేనివిధంగా రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 వందల 62 కోట్ల రూపాయల ప్రాఫిట్ నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం 930 కోట్లు మాత్రమే లాభం పొందింది. బ్యాంక్‌కు వచ్చిన నికర వడ్డీ 6 వేల 473 కోట్ల నుంచి 7 వేల 343 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు ఒక ఏడాదిలో ఆర్జించిన అత్యధిక నికర వడ్డీ ఆదాయం కూడా ఇదే కావటం గమనించాల్సిన అంశం.

దివాలా తీసిన ‘గోఫస్ట్’

గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ దివాలా తీసింది. పరిష్కారం చూపాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. ఈ కంపెనీ కష్టాలు ఇక్కడితో అయిపోలేదు. రేపటి నుంచి మూడు రోజుల పాటు విమాన సర్వీసులను రద్దు చేసింది. అందుబాటులో నిధులు లేకపోవటం వల్ల చేసేదేమీ లేక ఈ నిర్ణయం తీసుకుంది. అకస్మాత్తుగా సర్వీసులను రద్దు చేయటం పట్ల ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. ఈ నెల మూడు, నాలుగు, ఐదు తేదీలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నవారికి పూర్తిగా రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhogapuram
  • FASTag daily toll collection
  • gofirst
  • hiv children
  • international airport

తాజావార్తలు

  • Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు

  • Mini Cooper S Victory Edition: చిల్లీ రెడ్ లుక్, 204 PS పవర్‌తో.. మినీ కూపర్ ఎస్ విక్టరీ లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్

  • RGUKT Basara : ఆర్‌జీయూకేటీ బాసర అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

  • Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

  • Pete Hegseth: US రక్షణ మంత్రి ‘నో మెర్సీ’ వార్నింగ్.. ఇరాన్‌పై ఇవాళ అత్యంత భీకర దాడులు

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions