CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
- భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ సీఎం..
- ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు..
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కీలకం..
- గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్నారు.. హైదారాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్ లో ఈ ఎయిర్పోర్ట్తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు.. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్పోర్ట్కు ఆమోదం చేశాను.. కానీ, వైసీపీ వాళ్లు వచ్చి మొత్తం కూని చేశారు.. పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపలకే మళ్లీ శంకుస్థాపన చేశారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యత కంపెనీల ప్రముఖులు..
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 31.8 శాతం వర్క్ పూర్తి అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పౌరవిమానాయశాఖ మంత్రి, ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ… ఇరువురూ ఉత్తరాంధ్రకు చెందినవారే అని గుర్తుచేశారు.. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు.. 400 కోట్లతో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారు.. ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమని అడిగానన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే చుట్టూ పక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ది చెందుతాయన్నారు. ఇక, కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి.. ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తాం అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఓటు వేసేవారిని విస్మరించను.. వారి అభివృద్ది, సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ – రాధిక పెళ్లిలో ఈ “ఛాట్” ప్రత్యేకం..
2026 నాటికి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను అన్నారు సీఎం చంద్రబాబు.. మోస్ట్.. మోడరన్ ఎయిర్ పోర్టుగా ఈ ఎయిర్పోర్ట్ రెడీ అవ్వాలన్న ఆయన.. జీఎంఆర్ సంస్థకి కూడా చాలా ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్షన్కి వచ్చాయన్నారు. ఇక, ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాను అన్నారు చంద్రబాబు.. పవన్ కల్యాణ్, బీజేపీకి కూడా ఈ ప్రాంతం వాసులు మద్దతు ఇచ్చారు అని గుర్తుచేసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో ఐదు ఎయిర్పోర్ట్లు కొత్తగా వస్తాయి… కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో మూడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!