CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
- భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ సీఎం..
- ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు..
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కీలకం..
- గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్నారు.. హైదారాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్ లో ఈ ఎయిర్పోర్ట్తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు.. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్పోర్ట్కు ఆమోదం చేశాను.. కానీ, వైసీపీ వాళ్లు వచ్చి మొత్తం కూని చేశారు.. పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపలకే మళ్లీ శంకుస్థాపన చేశారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యత కంపెనీల ప్రముఖులు..
Also Read
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 31.8 శాతం వర్క్ పూర్తి అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పౌరవిమానాయశాఖ మంత్రి, ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ… ఇరువురూ ఉత్తరాంధ్రకు చెందినవారే అని గుర్తుచేశారు.. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు.. 400 కోట్లతో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారు.. ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమని అడిగానన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే చుట్టూ పక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ది చెందుతాయన్నారు. ఇక, కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి.. ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తాం అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఓటు వేసేవారిని విస్మరించను.. వారి అభివృద్ది, సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ – రాధిక పెళ్లిలో ఈ “ఛాట్” ప్రత్యేకం..
2026 నాటికి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను అన్నారు సీఎం చంద్రబాబు.. మోస్ట్.. మోడరన్ ఎయిర్ పోర్టుగా ఈ ఎయిర్పోర్ట్ రెడీ అవ్వాలన్న ఆయన.. జీఎంఆర్ సంస్థకి కూడా చాలా ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్షన్కి వచ్చాయన్నారు. ఇక, ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాను అన్నారు చంద్రబాబు.. పవన్ కల్యాణ్, బీజేపీకి కూడా ఈ ప్రాంతం వాసులు మద్దతు ఇచ్చారు అని గుర్తుచేసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో ఐదు ఎయిర్పోర్ట్లు కొత్తగా వస్తాయి… కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో మూడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?