Tragedy: స్కూల్ క్యాంపస్లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
- అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం
- సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో కూలిన వాటర్ ట్యాంక్
- ముగ్గురు విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ క్రమంలో.. పాఠశాల గందరగోళంలో మునిగిపోయింది. క్షతగాత్రులను టోమో రిబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (TRIHMS)కి తరలించారు. 9వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు మిగలలేదు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు.
Read Also: Group 2 Exam: నేడు, రేపు గ్రూప్ -2 పరీక్షలు.. అరగంట ముందే గేట్లు క్లోజ్!
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఈ ఘటనను డీఎస్పీ, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ధృవీకరించారు. పాఠశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో.. స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, నలుగురు వార్డెన్లతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. పాఠశాల ప్రాంగణం సీలు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. కాగా.. ట్యాంకు కూలిపోవడానికి గల కారణాన్ని గుర్తించేందుకు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని.. ఈ ఘటనలో ఎవరిని వదిలేది లేదని అధికారులు హామీ ఇచ్చారు.
Read Also: Gujarat: ఉద్యోగం నచ్చలేదని తన వేళ్లు తానే కోసుకున్న యువకుడు..
ఈ ప్రమాదంపై నహర్లగన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్డిపిఓ తెలిపారు. ఉదయం 9:00 గంటల ప్రాంతంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమై ట్యాంక్ దగ్గర రివైజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!