Tragedy: స్కూల్ క్యాంపస్లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
- అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం
- సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో కూలిన వాటర్ ట్యాంక్
- ముగ్గురు విద్యార్థులు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ క్రమంలో.. పాఠశాల గందరగోళంలో మునిగిపోయింది. క్షతగాత్రులను టోమో రిబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (TRIHMS)కి తరలించారు. 9వ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రాణాలు మిగలలేదు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు.
Read Also: Group 2 Exam: నేడు, రేపు గ్రూప్ -2 పరీక్షలు.. అరగంట ముందే గేట్లు క్లోజ్!
Also Read
ఈ ఘటనను డీఎస్పీ, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ధృవీకరించారు. పాఠశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో.. స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం, నలుగురు వార్డెన్లతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. పాఠశాల ప్రాంగణం సీలు చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు. కాగా.. ట్యాంకు కూలిపోవడానికి గల కారణాన్ని గుర్తించేందుకు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని.. ఈ ఘటనలో ఎవరిని వదిలేది లేదని అధికారులు హామీ ఇచ్చారు.
Read Also: Gujarat: ఉద్యోగం నచ్చలేదని తన వేళ్లు తానే కోసుకున్న యువకుడు..
ఈ ప్రమాదంపై నహర్లగన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్డిపిఓ తెలిపారు. ఉదయం 9:00 గంటల ప్రాంతంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమై ట్యాంక్ దగ్గర రివైజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!