Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story These Women Will Represent The Telugu States In Lok Sabha

Lok Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు వీరే..

Published Date :June 6, 2024 , 5:23 pm
By Mahesh Jakki
Lok Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు వీరే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lok Sabha: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది. దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీల్లో 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, బీజేపీ అత్యధికంగా 69 మంది మహిళా అభ్యర్థులను, కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మహిళలు ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల తరఫున దాదాపు 15 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు గెలిచి ఈసారి పార్లమెంటుకు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, డీకే అరుణ.. ఏపీ నుంచి గుమ్మా తనూజా రాణి, బైరెడ్డి శబరి, దగ్గుబాటి పురంధేశ్వరిలు లోక్‌సభ ఎంపీలుగా గెలిచారు.

Read Also: Criminal Cases On MP: వామ్మో.. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో అంతమందిపై క్రిమినల్ కేసులు..

తెలంగాణలో ఇలా..
తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, హైదరాబాద్ నుంచి మాధవి లతను బీజేపీ ప్రకటించింది. మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి మాలోత్ కవితను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది.ఆదిలాబాద్ (ఎస్టీ)కి ఆత్రం సుగుణ, వరంగల్ (ఎస్సీ)కి కడియం కావ్య, మల్కాజిగిరి నియోజకవర్గానికి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ ఎన్నుకుంది. కాంగ్రెస్ తరఫున వరంగల్‌ ఎంపీ స్థానం నుంచి కడియం కావ్య పోటీ చేసి గెలిచారు. కావ్య భారీ ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరంగల్‌లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2,20,339 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డీకే అరుణ బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిపై 4,500 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మొదటి సారి పోటీ చేసిన మాధవి లత దాదాపు 3,23,894 ఓట్లు సాధించి హైదరాబాద్‌లో రెండవ స్థానంలో నిలిచారు, అసదుద్దీన్ ఒవైసీ విజేతగా నిలిచారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆత్రం సుగుణ ఓటమి పాలయ్యారు. బీజేపీకి చెందిన గోడం నగేష్‌ అక్కడి నుంచి గెలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఓడిపోయారు. మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన మాలోత్ కవిత.. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌పై ఓడిపోయారు.

Read Also: AP CEO Meet Governor: గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేసిన ఏపీ సీఈవో

ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలు
కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ముగ్గురు మహిళా అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నలుగురు, కాంగ్రెస్‌ ఇద్దరు, బీజేపీ ఇద్దరు, టీడీపీ ఒక మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో వైఎస్సార్‌సీపీ, బీజేపీ, టీడీపీ నుంచి ఒక్కో మహిళా అభ్యర్థి గెలుపొందారు. అరకు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి గుమ్మా తనూజా రాణి (4,77,005 ఓట్లు) బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత (4,26,425 ఓట్లు)పై విజయం సాధించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి 7,01,131 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి (5,89,156 ఓట్లు)తో గెలుపొందారు.రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ (4,87,376 ఓట్లు)పై బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి 7,26,515 ఓట్లతో గెలుపొందారు.

ఓడిపోయిన అభ్యర్థులలో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్యం 2,086 ఓట్లు మాత్రమే సాధించగా, కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి 1,41,039 ఓట్లు సాధించారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జె శాంత 5,93,107 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పార్టీకి చెందిన ఉమాబాల గూడూరి కూడా రెండో స్థానంలో ఉన్నారు. ఆమె నరసాపురంలో 4,30,541 ఓట్లు సాధించారు, బీజేపీకి చెందిన భూపతి రాజు శ్రీనివాస వర్మ 7,07,342 ఓట్లతో విజయం సాధించారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి భరత్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి బొత్స 4,03,220 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • byreddy Shabari
  • DK Aruna
  • Gumma Tanujarani
  • Kadiyam Kavya

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions