Criminal Cases On MP: వామ్మో.. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో అంతమందిపై క్రిమినల్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Criminal Cases On MP: మంగళవారం నాడు వెలుబడిన ఎన్నికల ఫలితాలలో కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక 543 మందిలో ఏకంగా 251 మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికైన వారిలో 46 శాతంగా ఉంది. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం. లోక్ సభకు ఎన్నికైన అత్యధిక సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల వివరాలు చూస్తే..
Annamalai: కమలం ఎప్పటికీ వికసించదు, అన్నామలై రాజీనామా చేయాలి..కనిమొళి డిమాండ్..
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మంది 31% అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా 2019లో 159 (29%) ఎంపీలు, 2014లో 112 (21%) ఎంపీలు, 2009లో 76 (14%) ఎంపీల కంటే ఎక్కువ అని విశ్లేషణలో తేలింది. 2009 నుంచి ఇప్పటికి తీవ్రమైన క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 124% పెరిగింది.
27 మంది గెలుపొందిన అభ్యర్థులు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలగా, అందులో నలుగురు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యకు సంబంధించిన కేసులు, 27 మంది ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నానికి సంబంధించిన కేసులు ప్రకటించారు. గెలిచిన పదిహేను మంది అభ్యర్థులు ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు. అంతేకాకుండా గెలిచిన నలుగురు అభ్యర్థులు కిడ్నాప్కు సంబంధించిన కేసులను ప్రకటించారు. అలాగే 43 మంది ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు.
Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ
2024 లోక్సభ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న అభ్యర్థికి గెలిచే అవకాశాలు 15.3% ఉండగా, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థులు కేవలం 4.4% మాత్రమేనని విశ్లేషణలో తేలింది. 18వ లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన 240 మంది గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో 94 మంది (39%) క్రిమినల్ కేసులను ప్రకటించారని ఏడీఆర్ పేర్కొంది. కాంగ్రెస్ గెలిచిన 99 మంది అభ్యర్థుల్లో 49 మంది (49 %) క్రిమినల్ కేసులను ప్రకటించగా, సమాజ్ వాదీ పార్టీకి చెందిన 37 మంది అభ్యర్థుల్లో 21 మంది (45 %) క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఎంసీకి చెందిన 29 మందిలో 13 మంది (45%), డీఎంకేకు చెందిన 22 మందిలో 13 మంది (59%), టీడీపీకి చెందిన 16 మందిలో ఎనిమిది మంది (50%), శివసేన ఏడుగురు గెలిచిన అభ్యర్థుల్లో ఐదుగురు (71%) నేరస్థులుగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!