Ganesh Chaturdhi: వినాయకుని విగ్రహాలు మట్టితో చెయ్యడానికి గల కారణాలు
భారత దేశం విజ్ఞాన బండాగారం. ఆ విజ్ఞానములో నుండి ఆవిర్భవించినవే పండుగలు. ప్రతి పండుగ వెనక ఓ పరమార్ధం ఉంది. ఆలోచిస్తే అర్ధం అవుతుంది. మరో రెండు రోజుల్లో మన వినాయకుడు ఎలుక వాహనం పైన భూలోకం రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆయన ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన విజ్ఞానంతో వంద అడుగుల ప్రతిమలైన చేయగలుగుతున్నారు. కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా చాలా ప్రాంతాలల్లో మట్టి వినాయకునికి పూజలు చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది మట్టితో చేసిన విగ్రహాలను వాడమని సూచిస్తుంటారు. ఎందుకు మట్టి తో చేసిన వినాయకునికి పూజలు చేయమంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chaturdhi: వినాయక చవితి ప్రాముఖ్యత.. ఈ పండుగ విశిష్టత
Also Read
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు వినాయక చవితి వస్తుంది. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనితో మానిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించాలి అంటారు. అలా మట్టితో చేసిన వినాయకుణ్ణి మూడు నుండి పదకొండు రోజులు వివిధ రాకాల ఆకులతో పూజిస్తారు. అలానే పూజలో పసుపు కుంకుమ కూడా ఉపయోగిస్తారు. ఇలా పూజ చేసిన వినాయకుని ప్రతిమని నదులల్లో, చెరువుల్లో, కాలవల్లో మొదలైన చోట్ల నీటిలో నిమర్జనం చేయడం వల్ల ఆ ప్రదేశం లోని నీవు శుభ్రం అవుతుంది. ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు.
Read also:Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
కానీ మనం ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కళ్ళకు ఇంపుగా కనిపిస్తే చాలు అనుకుని రసాయన పూరితమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన వినాయకుని ప్రతిమలని పూజిస్తున్నాం. వీటివల్ల పర్యావరణం కాలుషితం అవుతుంది. మట్టి విగ్రహాలు నీటిలో వేసిన వెంటనే మునిగి కరిగిపోతాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన విగ్రహాలు అంత త్వరగా కరగవు. కరగడానికి నెలల కాలం పడుతుంది. వీటి వల్ల తాగే నీరు కలుషితం అవుతుంది.
Read also:Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ చేయండి.. నిపా నేపథ్యంలో హైకోర్టు
ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ప్రస్తుత కాలంలో మినరల్ వాటర్ తాగే వాళ్ళకి నదిలో నీళ్లతో పనిలేదు అనుకుక్నటున్నారా? మనం డైరెక్ట్ గా ఆ నీళ్ళని తాగపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నాం. అలానే ఆ నీటిలో ఎన్నో జలచరాలు జీవిస్తుంటాయి. ఈ కాలుష్యం ఆ జలచరాల మనుగడ పైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నోరు లేని ఆ జలచరాలు ప్రశాతంగా జీవించాలి అని కోరుకుందాం. ఈ వినాయక చవితిని మట్టి తో చేసిన ప్రతిమలతో జరుపుకుందాం. నీటి కాలుష్యాన్ని నివారిదాం. పాఠకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!