Ganesh Chaturdhi: వినాయకుని విగ్రహాలు మట్టితో చెయ్యడానికి గల కారణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం విజ్ఞాన బండాగారం. ఆ విజ్ఞానములో నుండి ఆవిర్భవించినవే పండుగలు. ప్రతి పండుగ వెనక ఓ పరమార్ధం ఉంది. ఆలోచిస్తే అర్ధం అవుతుంది. మరో రెండు రోజుల్లో మన వినాయకుడు ఎలుక వాహనం పైన భూలోకం రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన ఆయన ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన విజ్ఞానంతో వంద అడుగుల ప్రతిమలైన చేయగలుగుతున్నారు. కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా చాలా ప్రాంతాలల్లో మట్టి వినాయకునికి పూజలు చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది మట్టితో చేసిన విగ్రహాలను వాడమని సూచిస్తుంటారు. ఎందుకు మట్టి తో చేసిన వినాయకునికి పూజలు చేయమంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chaturdhi: వినాయక చవితి ప్రాముఖ్యత.. ఈ పండుగ విశిష్టత
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు వినాయక చవితి వస్తుంది. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనితో మానిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని నివారించడానికి మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించాలి అంటారు. అలా మట్టితో చేసిన వినాయకుణ్ణి మూడు నుండి పదకొండు రోజులు వివిధ రాకాల ఆకులతో పూజిస్తారు. అలానే పూజలో పసుపు కుంకుమ కూడా ఉపయోగిస్తారు. ఇలా పూజ చేసిన వినాయకుని ప్రతిమని నదులల్లో, చెరువుల్లో, కాలవల్లో మొదలైన చోట్ల నీటిలో నిమర్జనం చేయడం వల్ల ఆ ప్రదేశం లోని నీవు శుభ్రం అవుతుంది. ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు.
Read also:Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
కానీ మనం ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కళ్ళకు ఇంపుగా కనిపిస్తే చాలు అనుకుని రసాయన పూరితమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన వినాయకుని ప్రతిమలని పూజిస్తున్నాం. వీటివల్ల పర్యావరణం కాలుషితం అవుతుంది. మట్టి విగ్రహాలు నీటిలో వేసిన వెంటనే మునిగి కరిగిపోతాయి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తాయారు చేసిన విగ్రహాలు అంత త్వరగా కరగవు. కరగడానికి నెలల కాలం పడుతుంది. వీటి వల్ల తాగే నీరు కలుషితం అవుతుంది.
Read also:Sabarimala: శబరిమల యాత్రికులకు మార్గదర్శకాలు జారీ చేయండి.. నిపా నేపథ్యంలో హైకోర్టు
ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారు. ప్రస్తుత కాలంలో మినరల్ వాటర్ తాగే వాళ్ళకి నదిలో నీళ్లతో పనిలేదు అనుకుక్నటున్నారా? మనం డైరెక్ట్ గా ఆ నీళ్ళని తాగపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నాం. అలానే ఆ నీటిలో ఎన్నో జలచరాలు జీవిస్తుంటాయి. ఈ కాలుష్యం ఆ జలచరాల మనుగడ పైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నోరు లేని ఆ జలచరాలు ప్రశాతంగా జీవించాలి అని కోరుకుందాం. ఈ వినాయక చవితిని మట్టి తో చేసిన ప్రతిమలతో జరుపుకుందాం. నీటి కాలుష్యాన్ని నివారిదాం. పాఠకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!