New Parliament: కొత్త పార్లమెంట్ ఓపెనింగ్.. వాళ్లు రాకపోయినా మేము వస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ను ప్రారంభించడం సంచలనం రేపుతుంది. ఇప్పటికే ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేమంటూ అనేక పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. మరి కొన్ని పార్టీ మాత్రం వీటికి భిన్నంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారు. అందులో ఒకటి.. బిజూ జనతాదళ్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు బుధవారం తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.
Also Read : America : అమెరికాలో కారు యాక్సిడెంట్.. చనిపోయిన మహబూబ్ నగర్ వాసి
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
పార్టీ ఎంపీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటిస్తూ బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి విడుదల చేశారు. ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న పార్లమెంటు రాజకీయాలకు అతీతమైనదని, దాని అధికారం మరియు స్థాయిని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని పార్టీ విశ్వసిస్తుందని పేర్కొంది. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రత మరియు గౌరవాన్ని ప్రభావితం చేసే ఏదైనా సమస్యకు అతీతంగా ఉండాలని BJD విశ్వసిస్తుంది అని పేర్కొన్నాయి.. అటువంటి అంశాలు ఎల్లప్పుడూ ఆగస్టు హౌస్లో చర్చించబడతాయన్నారు. ప్రస్తుతం బీజేడీకి లోక్సభలో 12 మంది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.
Also Read : CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
మే 28( ఆదివారం)న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం జరుగనుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా పంతొమ్మిది ప్రతిపక్ష పార్టీలు బుధవారం బహిష్కరణను ప్రకటిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అంటూ సంబోధించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపించకపోవడం దారుణమని వారు ఆరోపించారు.
Also Read : Narendra Modi: ప్రతిపక్షాల విమర్శలను మోడీ నిజం చేశారా.. తొమ్మిదేళ్లలో ఎన్ని దేశాలకు వెళ్లారు ?
కానీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీ ఓపెనింగ్ చేసే నూతన పార్లమెంట్ భవనానికి తమ పార్టీ ఎంపీలు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలన్న తమ పార్టీ విధానాన్ని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో (2024 ) తృతీయ ఫ్రంట్ వచ్చే అవకాశం కనిపించడం లేదని అన్నారు. BJP-కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉండేలా BJD నిర్ధారించుకుంది.
Also Read : What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కూడా హాజరవుతానని ధృవీకరించింది. 2014 జూన్లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున నిధులను కేంద్రం ఇటీవలే ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేంద్రం విధానాలకు మద్దతు ఇచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమని అన్నారు.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!