CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
CM KCR: నేడు సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొంటారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, తెలంగాణ 9వ విడత హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇంటి పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ను సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా.. ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది వేడుకలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.
Read also: Food Poisoning : ఆవురావురు మంటూ రసగుల్లా తిన్నారు.. ఆస్పత్రిలో పడ్డారు
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఉత్సవాల రోజువారీ షెడ్యూల్ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఓ శాఖ గత 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచనుంది. సీఎం కేసీఆర్ దశాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని గన్పర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దశాబ్ది సందేశం ఇస్తారు. అదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ జెండా వందనం, దశాబ్ది వేడుకల సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 22న తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Rohit Sharma: మాకు స్టార్లు అవసరం లేదు.. మేమే తయారు చేస్తాం..
తాజావార్తలు
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో