Manipur Violence: క్రిస్మస్ వేళ.. కాల్పులతో మరోసారి దద్దరిల్లిన మణిపూర్
- మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులు
- ఇంఫాల్కు ఆనుకుని ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లో ఘటన
- మృతుల సంఖ్యపై తెలియని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను ప్రభావిత గ్రామాలకు పంపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మరోవైపు.. చురచంద్పూర్ జిల్లాలో భద్రతా దళాలు వంతెన కింద నుంచి 3.6 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో ఇంఫాల్-చురచంద్పూర్ రహదారిలోని లీసాంగ్ గ్రామం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పేలుడు పదార్థాలతో పాటు.. డిటోనేటర్లు, కార్డ్టెక్స్, ఇతర వస్తువులను బృందం స్వాధీనం చేసుకుంది.
READ MORE: Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
ఇదిలా ఉండగా.. ఈశాన్య భారతానికి విలువైన ఆభరణంగా వాసికెక్కిన రాష్ట్రం మణిపుర్. చూడచక్కని ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ రాష్ట్రం ఇటీవల మళ్లీ అగ్నిగుండంగా మారింది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏళ్లుగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్లో హింస మరోసారి పెచ్చుమీరుతోంది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. అప్పటి నుంచి వరసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!