Supreme Court: సుప్రీంకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఏపీ న్యాయమూర్తి పేరు రెకమెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు కొలీజియం.. ఇవాళ కొందరు సీనియర్ జడ్జీలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ జాబితాను రూపొందించింది. దీన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంది. అయితే, ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ భట్టి ఉన్నారు. వారిద్దరికీ సుప్రీంకోర్టు కొలీజియం పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టుకు రెకమెండ్ చేసింది.
Read Also: BRO: ఎట్టకేలకు బ్రో సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందిగా..
Also Read
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 2011 అక్టోబర్ 17వ తేదీన గౌహతి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్ 28వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయపరమైన పలు అంశాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రత్యేకించి- పన్నుల చట్టంలో ఉజ్జల్ భూయాన్ నిష్ణాతులు.. అయితే ఆయన గౌహతి హైకోర్టు నుంచి బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ పలు కేసులను డీల్ చేసి అనంతరం పదోన్నతి మీద తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు.
Read Also: Kakani Govardhan Reddy: టీడీపీ చచ్చిపోయింది.. పాడె పట్టడానికి పవన్ ఆరాటపడుతున్నాడు..
ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి జిల్లాలోని మదనపల్లి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి స్వస్థలం. ఆయన 2013 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీగా వెళ్లారు. అయితే, ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 ఉండగా.. ఇప్పుడు 29 మంది పని చేస్తున్నారు. తాజాగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టితో ఈ సంఖ్య 31కి చేరుతుంది. ఇక శుక్రవారం నాడు జస్టిస్ కృష్ణ మురారి పదవీ విరమణ చేయనున్నారు.
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!