TGO- TNGO: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Govt Employees Association: బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా రెండవ పీఆర్సీని 1.7. 2023 నుంచి 51 శాతం ఫిట్మెంట్ తో ఆనాటికి ఉన్న 33.67 శాతం మొత్తం కలిపి అందజేయాలి అని కోరారు. ఇక, కనిష్ట వేతనం 35,000 నుంచి గరిష్ట వేతనం 2,99,100 రూపాయలు ఇవ్వాలన్నారు.
Read Also: SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
ఇక, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలి అని టీజీఓ, టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్క్రీన్ ను ఇప్పుడున్న 6/ 12 /18 /24 స్థానాలలో 5/ 10 /15 /20 25 లుగా ఇవ్వాలన్నారు. అయితే, ఇంటి అద్దె బత్యాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో 27 శాతంగా 2 లక్షలకు పై జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో 18.5 శాతంగా 50 వేల కంటే ఎక్కువగా రెండు లక్షల కంటే తక్కువ జనాభా గలిగిన మండల కేంద్రాల్లో 14 శాతం అలాగే, మిగతా స్థానాల్లో 11.5 శాతం అద్దె చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: Minister Ponguleti: రెవెన్యూ సెక్టార్ లో అవినీతిని పూర్తిగా అంతరించాలి..
అయితే, కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 నుంచి 17,500 రూపాయలకు పెంచాలి అని టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఇక, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 16 లక్షల నుంచి 24 లక్షలు పెంచాలన్నారు. 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగి కానీ పెన్షనర్లు కానీ చనిపోతే ఇప్పుడున్న 30 వేల దహన ఖర్చులను 75 వేల రూపాయలకు పెంచాలి అని కోరారు. అయితే, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులను ఇప్పుడున్న స్థానాన్ని పెంచి 30, 40, 50 లక్షలుగా ఇవ్వాలి అని పేర్కొన్నారు. అలాగే, కామన్ క్యాటగిరి ఉద్యోగుల వేతనాన్ని గత కొన్ని పీఆర్సీలలో నెగ్లెట్ చేస్తున్నారు.. కనుక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్ స్కేల్స్ ను ధరల ఆధారంగా పెంచి ఇవ్వాలన్నారు. పీఆర్సీ కమిటీ ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోపలనే తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించాలి అని టీజీవో- టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?