Anantapur: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం.. హుండీలో వేసిన నగలు దోపిడీ..!
- శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం
- హుండీలో వేసిన నగలు దోపిడీ
- నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది. పంపకాలలో తేడాలు రావడంతో తిరిగి హుండీలో వేసినట్టు ప్రచారంసాగుతోంది.
Also Read:Prudhvi Raj : వారు ఇచ్చిన నమ్మకమే నన్ను నడిపించింది..
Also Read
నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఏడవ తేదీన హుండీలో సొమ్ములు మూటకట్టి వేయగా.. రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు లెక్కింపులో చూపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. హుండీ లెక్కించే సమయంలో నగల మూట జంకాలం (మ్యాట్) కింద ఉండిపోవడంతో గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు. భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు ఉన్నతాధికారులకు తెలపక పోవడంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ఈవో రమేష్ ను ప్రశ్నించారు.
Also Read:Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
హుండీ కౌంటింగ్ అనంతరం జంకాలాలు (మ్యాట్) తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగల మూట కనిపించడంతో తిరిగి తనకు అప్పగించారని వెంటనే హుండీలో వేశానని ఆలయ ఈవో విచారణ అధికారులకు చెప్పారు. సిబ్బంది చేతివాటం ఘటనపై విచారణ చేపట్టి… బాద్యులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!