Anantapur: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం.. హుండీలో వేసిన నగలు దోపిడీ..!
- శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం
- హుండీలో వేసిన నగలు దోపిడీ
- నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది. పంపకాలలో తేడాలు రావడంతో తిరిగి హుండీలో వేసినట్టు ప్రచారంసాగుతోంది.
Also Read:Prudhvi Raj : వారు ఇచ్చిన నమ్మకమే నన్ను నడిపించింది..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఏడవ తేదీన హుండీలో సొమ్ములు మూటకట్టి వేయగా.. రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు లెక్కింపులో చూపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. హుండీ లెక్కించే సమయంలో నగల మూట జంకాలం (మ్యాట్) కింద ఉండిపోవడంతో గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు. భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు ఉన్నతాధికారులకు తెలపక పోవడంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ఈవో రమేష్ ను ప్రశ్నించారు.
Also Read:Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
హుండీ కౌంటింగ్ అనంతరం జంకాలాలు (మ్యాట్) తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగల మూట కనిపించడంతో తిరిగి తనకు అప్పగించారని వెంటనే హుండీలో వేశానని ఆలయ ఈవో విచారణ అధికారులకు చెప్పారు. సిబ్బంది చేతివాటం ఘటనపై విచారణ చేపట్టి… బాద్యులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!