Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
- కాథలిక్ చర్చి భూమిలో అవశేషాలు
- శివలింగంతో పాటు పలు దేవతల విగ్రహాలు
కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
READ MORE: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతున్నారు. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. అవశేషాలు బయటపడటంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా.. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కెఎస్ మాట్లాడారు. “వాస్తవానికి ఫిబ్రవరి 4న అవశేషాలు దొరికాయి. అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం. అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసింది. దీని తరువాత.. ఆలయ కమిటీ చర్చి నిర్వాహకులను సంప్రదించింది. హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారు. ” అని తెలిపారు.
READ MORE: Rekhachitram: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’.. ఎప్పుడంటే?
మీనాచిల్ (పలై) హిందూ మహాసంఘం అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు. ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులు చెప్పారన్నారు. కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదిలీ అయిందన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో