Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
- కాథలిక్ చర్చి భూమిలో అవశేషాలు
- శివలింగంతో పాటు పలు దేవతల విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
READ MORE: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతున్నారు. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. అవశేషాలు బయటపడటంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా.. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కెఎస్ మాట్లాడారు. “వాస్తవానికి ఫిబ్రవరి 4న అవశేషాలు దొరికాయి. అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం. అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసింది. దీని తరువాత.. ఆలయ కమిటీ చర్చి నిర్వాహకులను సంప్రదించింది. హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారు. ” అని తెలిపారు.
READ MORE: Rekhachitram: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’.. ఎప్పుడంటే?
మీనాచిల్ (పలై) హిందూ మహాసంఘం అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు. ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులు చెప్పారన్నారు. కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదిలీ అయిందన్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!