Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
- కాథలిక్ చర్చి భూమిలో అవశేషాలు
- శివలింగంతో పాటు పలు దేవతల విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
READ MORE: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతున్నారు. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. అవశేషాలు బయటపడటంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా.. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కెఎస్ మాట్లాడారు. “వాస్తవానికి ఫిబ్రవరి 4న అవశేషాలు దొరికాయి. అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం. అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసింది. దీని తరువాత.. ఆలయ కమిటీ చర్చి నిర్వాహకులను సంప్రదించింది. హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారు. ” అని తెలిపారు.
READ MORE: Rekhachitram: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’.. ఎప్పుడంటే?
మీనాచిల్ (పలై) హిందూ మహాసంఘం అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు. ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులు చెప్పారన్నారు. కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదిలీ అయిందన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!