Cricket: భారత–’A’ జట్టులో తెలుగు కుర్రాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. నితీశ్ గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఒకే మ్యాచ్ లో అతనికి అవకాశం వచ్చింది.
శ్రీలంకలోని కొలంబో వేదికగా జులై 13 నుంచి 23 వరకు వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరనుంది. ఇప్పటి వరకు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటంతో జూనిల్ సెలెక్షన్ కమిటీ నితీశ్ కుమార్కు అవకాశం కల్పించింది.
మరోవైపు భారత్-ఏ జట్టుకు యశ్ ధూల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. అభిషేక్శర్మ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ఐపీఎల్ ప్లేయర్లు సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, రాజ్యవర్థన్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ
ఈ టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడుతాయి. భారత్, నేపాల్, యూఏఈ, పాకిస్థాన్ గ్రూప్–బిలో ఉన్నాయి. ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఒమన్ గ్రూప్–ఎలో బరిలో నిలిచాయి. జులై 13న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడే భారత్.. 15న పాకిస్థాన్, 18న నేపాల్తో ఆడనుంది.
V. Hanumantha Rao: తెలంగాణ రైతులను పట్టించుకోరు గానీ.. బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు
భారత –ఎ జట్టు: యష్ ధుల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్ ), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు, ప్రభ్సిమ్రాన్ సింగ్ (కీపర్), ధ్రువ్ జురెల్ (కీపర్), మానవ్ సుతార్, యువరాజ్ సింగ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాష్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్. స్టాండ్బై ఆటగాళ్లు: హర్ష్ దూబే, నెహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.
- Tags
- bcci
- india
- Sports
- team
- Telugu boy
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!