తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గ్రూప్-1 పరీక్షపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను కూడా జారీ చేశారు.
Also Read : Dil raju : ఆదిపురుష్ పై అంతగా ఆసక్తి చూపని దిల్ రాజు..!!
వచ్చే ఆదివారం పరీక్ష నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో కోర్టులో పిటిషన్ వేయడంపై ఉత్కంఠ నెలకొంది. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ కూడా లోపలికి అనుమంతించేది లేదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని వెల్లడించింది.
Also Read : Kanguva: సూర్య హాలీవుడ్ హీరోలా ఉన్నాడుగా…
అలాగే ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్తో మాత్రమే కరెక్ట్ గా బబ్లింగ్ చేయాలని సూచించింది. సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, పెన్సిల్, ఇంక్పెన్, జెల్పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకొని రావాలని క్లారిటీ ఇచ్చింది.