Ponnam Prabhakar : తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
నీటి నిల్వలు – గణాంకాలతో స్పష్టత
గత ఏడాది ఇదే రోజున లోయర్ మానేరు డ్యామ్ (LMD) లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు డ్యామ్ లో గత ఏడాది 8.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి అవసరాల కోసం 6.90 టీఎంసీలు అవసరం అని ఆయన తెలిపారు.
మిడ్ మానేరు డ్యామ్ నుంచి 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం జోన్-2 ఆయకట్టుకు ఈ నెల 6 వరకు 2500 క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు మంత్రి వివరించారు.
“కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు తాగునీటి కొరత లేదని” మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు కావాలని తాగునీటి సరఫరాపై అనవసరమైన అపోహలు కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు. “ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలను ముందస్తుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, నిరాధార ఆరోపణలను విశ్వసించవద్దని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?