Ponnam Prabhakar : తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
నీటి నిల్వలు – గణాంకాలతో స్పష్టత
గత ఏడాది ఇదే రోజున లోయర్ మానేరు డ్యామ్ (LMD) లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు డ్యామ్ లో గత ఏడాది 8.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి అవసరాల కోసం 6.90 టీఎంసీలు అవసరం అని ఆయన తెలిపారు.
మిడ్ మానేరు డ్యామ్ నుంచి 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం జోన్-2 ఆయకట్టుకు ఈ నెల 6 వరకు 2500 క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు మంత్రి వివరించారు.
“కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు తాగునీటి కొరత లేదని” మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు కావాలని తాగునీటి సరఫరాపై అనవసరమైన అపోహలు కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు. “ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలను ముందస్తుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, నిరాధార ఆరోపణలను విశ్వసించవద్దని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో