Ponnam Prabhakar : తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
నీటి నిల్వలు – గణాంకాలతో స్పష్టత
గత ఏడాది ఇదే రోజున లోయర్ మానేరు డ్యామ్ (LMD) లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు డ్యామ్ లో గత ఏడాది 8.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి అవసరాల కోసం 6.90 టీఎంసీలు అవసరం అని ఆయన తెలిపారు.
మిడ్ మానేరు డ్యామ్ నుంచి 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం జోన్-2 ఆయకట్టుకు ఈ నెల 6 వరకు 2500 క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు మంత్రి వివరించారు.
“కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు తాగునీటి కొరత లేదని” మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు కావాలని తాగునీటి సరఫరాపై అనవసరమైన అపోహలు కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు. “ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలను ముందస్తుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, నిరాధార ఆరోపణలను విశ్వసించవద్దని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!