Ponnam Prabhakar : తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
నీటి నిల్వలు – గణాంకాలతో స్పష్టత
గత ఏడాది ఇదే రోజున లోయర్ మానేరు డ్యామ్ (LMD) లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు డ్యామ్ లో గత ఏడాది 8.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి అవసరాల కోసం 6.90 టీఎంసీలు అవసరం అని ఆయన తెలిపారు.
మిడ్ మానేరు డ్యామ్ నుంచి 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం జోన్-2 ఆయకట్టుకు ఈ నెల 6 వరకు 2500 క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు మంత్రి వివరించారు.
“కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు తాగునీటి కొరత లేదని” మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు కావాలని తాగునీటి సరఫరాపై అనవసరమైన అపోహలు కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు. “ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలను ముందస్తుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, నిరాధార ఆరోపణలను విశ్వసించవద్దని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!