TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..
- ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
- అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రులను కలిసిందిలేదు.. తీసుకొచ్చింది లేదని ఆరోపించారు. తమ పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారని ఎంపీ అనిల్ కుమార్ అన్నారు. 2026లో “ఖేలో ఇండియా” తెలంగాణలో జరగబోతున్నాయన్నారు. కేటీఆర్ భజన మండలి 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఏమి తెచ్చిందో చెప్పాలని పేర్కొన్నారు. కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఆరోపించారు.
Read Also: BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.
Also Read
- Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
- GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
ఎంపీ కావ్య మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్ ప్రజల కల కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వచ్చి ప్రధానిని కోరారని ఎంపీ కావ్య అన్నారు. రేవంత్ రెడ్డి కృషివల్లనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది.. 2025 ఆగస్టు వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారని పేర్కొన్నారు. తొలుత రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం ఇచ్చారు.. తర్వాత దాన్ని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు పూర్తిగా “వందే భారత్ కోచ్” లు కూడా తయారుచేసేలా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఎంపీ తెలిపారు. ఇందుకు మరో 200 ఎకరాల స్థలం కావాలని కేంద్రం కోరింది.. రాష్ట్రం సిద్ధంగా ఉందని అన్నారు.
Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్ విభజన హామీగా ఉన్న కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్రంపై ఒత్తిడి చేయలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేంద్రం వెంటపడి సాధించారు.. అందుకే 28 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఎంపీ రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమస్యలపై బీజేపీ ఎంపీలను కలుపుకొని వెళతాం, తప్పేమీ లేదని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు అయ్యాక అభివృద్ధే తమ లక్ష్యం అని తెలిపారు. బీజేపీ ఎంపీల సహాయం ఖచ్చితంగా తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమకు సమస్యేమీ లేదని.. రాష్ట్ర అవసరాల కోసం నిరభ్యంతరంగా రమ్మని స్వయంగా రాజ్నాథ్ సింగ్ అన్నారని ఎంపీ రఘురామ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..