Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
- అజ్మీర్ దర్గా వివాదం..
- దర్గా ప్రాచీన శివాలయం అని కోర్టులో పిటిషన్..
- ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు. దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. హర్ బిలాస్ సర్దా (1867–1955) రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. 1910 ప్రచురణలో సర్దా “దర్గా కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రాశాడు” అని గుప్తా ఆరోపించారు.
విష్ణుగుప్తా సాక్ష్యంగా చెబుతున్న ఈ పుస్తకం ‘‘అజ్మీర్: ది హిస్టారిక్ అండ్ డిస్క్రప్టివ్’’. దీనిని 1911లో స్కాటిష్ మిషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రచురించింది. ఇందులో అజ్మీర్ దర్గా వద్ద ‘‘శివుడి’’తో అనుసంధానించబడే భూగర్బ సెల్లార్, సంప్రదాయం గురించి రాశాడు. ఖ్వాజా అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకలతో కప్పబడిన భూగర్భ సెల్లార్లో ఉన్నాయని, ఈ సమాధి పాలరాతితో , రంగు రాళ్లతో కప్పబడి ఉందని రాశాడు. సంప్రదాయం ప్రకారం.. సెల్లార్ లోపల ఆలయంలో మహాదేవుడి చిత్రం ఉందని రాయబడింది.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
Read Also: Value Zone-Hyper Mart: భారతదేశంలోనే అతి పెద్ద వాల్యూ జోన్-హైపర్ మార్ట్.. ఇప్పుడు నాచారంలో
మహదేవ మందిరం, శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటీష్ చరిత్రకారుడు ఆర్హెచ్ ఇర్విన్ రాసిన ‘‘సమ్ అకౌంట్ ఆఫ్ ది జనరల్ అండి మెడికల్ టోపోగ్రఫీ ఆఫ్ అజ్మీర్(1841)’’ చెప్పింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ ఉనికితో మహాదేశ పురాతన పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక సర్దా రాసిన బుక్లో బులంద్ దర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు. 75 అడుగుల గేట్ వేకి ఉత్తరం వైపున హిందూ సంబంధిత ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు.
1192 సెకండ్ బాటిల్ ఆఫ్ టెర్రైన్ జరిగిన సమయంలో ఉత్తర భారతదేశంలో అజ్మీర్ పెద్ద భాగంగా ఉండేది. అది మహ్మద్ ఘోరీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1206లో ఘోరీ మరణాంతరం బానిస వంశస్తులు కుతుబుద్దీన్ ఐబక్ పాలన ప్రారంభమైంది. అజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ ఇల్టుల్మిష్ (1211-1236) కాలంలో ప్రారంభమైంది. మొఘలు చక్రవర్తులు హుమాయూన్, షాజహాన్ పాలనలో అనేక మార్పులు జరిగాయి. అజ్మీర్ దర్గాలో సర్వే కోసం గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.
తాజావార్తలు
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!