Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
- అజ్మీర్ దర్గా వివాదం..
- దర్గా ప్రాచీన శివాలయం అని కోర్టులో పిటిషన్..
- ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు. దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. హర్ బిలాస్ సర్దా (1867–1955) రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. 1910 ప్రచురణలో సర్దా “దర్గా కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రాశాడు” అని గుప్తా ఆరోపించారు.
విష్ణుగుప్తా సాక్ష్యంగా చెబుతున్న ఈ పుస్తకం ‘‘అజ్మీర్: ది హిస్టారిక్ అండ్ డిస్క్రప్టివ్’’. దీనిని 1911లో స్కాటిష్ మిషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రచురించింది. ఇందులో అజ్మీర్ దర్గా వద్ద ‘‘శివుడి’’తో అనుసంధానించబడే భూగర్బ సెల్లార్, సంప్రదాయం గురించి రాశాడు. ఖ్వాజా అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకలతో కప్పబడిన భూగర్భ సెల్లార్లో ఉన్నాయని, ఈ సమాధి పాలరాతితో , రంగు రాళ్లతో కప్పబడి ఉందని రాశాడు. సంప్రదాయం ప్రకారం.. సెల్లార్ లోపల ఆలయంలో మహాదేవుడి చిత్రం ఉందని రాయబడింది.
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
Read Also: Value Zone-Hyper Mart: భారతదేశంలోనే అతి పెద్ద వాల్యూ జోన్-హైపర్ మార్ట్.. ఇప్పుడు నాచారంలో
మహదేవ మందిరం, శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటీష్ చరిత్రకారుడు ఆర్హెచ్ ఇర్విన్ రాసిన ‘‘సమ్ అకౌంట్ ఆఫ్ ది జనరల్ అండి మెడికల్ టోపోగ్రఫీ ఆఫ్ అజ్మీర్(1841)’’ చెప్పింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ ఉనికితో మహాదేశ పురాతన పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక సర్దా రాసిన బుక్లో బులంద్ దర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు. 75 అడుగుల గేట్ వేకి ఉత్తరం వైపున హిందూ సంబంధిత ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు.
1192 సెకండ్ బాటిల్ ఆఫ్ టెర్రైన్ జరిగిన సమయంలో ఉత్తర భారతదేశంలో అజ్మీర్ పెద్ద భాగంగా ఉండేది. అది మహ్మద్ ఘోరీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1206లో ఘోరీ మరణాంతరం బానిస వంశస్తులు కుతుబుద్దీన్ ఐబక్ పాలన ప్రారంభమైంది. అజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ ఇల్టుల్మిష్ (1211-1236) కాలంలో ప్రారంభమైంది. మొఘలు చక్రవర్తులు హుమాయూన్, షాజహాన్ పాలనలో అనేక మార్పులు జరిగాయి. అజ్మీర్ దర్గాలో సర్వే కోసం గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!