Supreme court: చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య
- చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు
- భరణంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ ఆత్మహత్య తర్వాత.. మహిళలు చట్టాలను ఉపయోగించుకుని చేస్తున్న అరాచకాలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. తన భార్య, అత్త కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులను 90 నిమిషాల వీడియో ద్వారా.. 40 పేజీల లేఖలో తెలియజేసి అతుల్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మహిళలు చట్టాలను అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది.
తాజాగా భరణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ చట్టాలలోని నిబంధనలు మహిళలను రక్షించడానికి మాత్రమేనని, అంతేతప్ప వారి భర్తలను శిక్షించడం, బెదిరించడం, ఆధిపత్యం చెలాయించడం లేదా బలవంతంగా వసూలు చేయడానికి కాదని సుప్రీంకోర్టు వ్యా్ఖ్యానించింది.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
విడిపోయిన భార్యకు ఒక నెలలో రూ.12 కోట్ల శాశ్వత భరణం చెల్లించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. విడిపోయిన భార్య.. తన భర్త సంపాదన నుంచి సమానమైన శాశ్వత భరణం కోరింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలు బలవంతంగా భర్తల నుంచి వసూలు చేయడానికి ఉద్దేశించినవి కావని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, పంకజ్ మిథాల్ మాట్లాడుతూ.. హిందూ వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా పరిగణిస్తారని.. ఒక కుటుంబానికి పునాదిగా పరిగణించబడతారన్నారు. అంతేతప్ప వివాహ వ్యవస్థ ‘‘వాణిజ్య వెంచర్’’ కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మహిళలు తమ చేతుల్లో ఉన్న చట్టాలను సంక్షేమానికి ఉపయోగించుకోవాలి కానీ.. భర్తలను శిక్షించడం కోసమో.. బెదిరించడం కోసమో.. లేదంటే ఆదిపత్యం చెలాయించడం కోసమో కాదని బెంచ్ పేర్కొంది. పోలీసు అధికారులు కూడా కొన్నిసార్లు సెలెక్టివ్ కేసుల్లో త్వరగా చర్య తీసుకుంటారని.. భర్త లేదా అతని బంధువులను కూడా అరెస్టు చేస్తున్నారని బెంచ్ ధ్వజమెత్తింది.
సంపదను సమయం చేయడానికి భరణం ఒక మార్గం కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమమైన భరణం కోరడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా మంది ఈ విధంగానే కోరుతున్నారని.. ఇలాంటి కేసులే ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. ఒక వేళ భర్త పేదవాడిగా మారితే.. భార్య సంపదను సమం చేయడానికి ఇష్టపడుతుందా? అని బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..