IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
- బంగ్లాదేశ్ పై టీమిండియా విక్టరీ
- 86 పరుగుల తేడాతో గెలుపు
- సిరీస్ కైవసం 2-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో అత్యధికంగా మహ్మదుల్లా (41) పరుగులు చేశాడు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో మహ్మదుల్లా తప్ప.. మిగతా బ్యాటర్లు అందరు విఫలమయ్యారు. పర్వేజ్ హుస్సేన్ (16), లిటన్ దాస్ (14), షాంటో (11), మెహిదీ హసన్ (16), రిషద్ హుస్సేన్ (9), తంజీమ్ హసన్ (8) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి.. బంగ్లాదేశ్ బ్యాటర్లను వెంట వెంటనే పెవిలియన్కు పంపించారు. ఈ మ్యాచ్ లో నితిష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు. వేసిన అందరు బౌలర్లు వికెట్ సంపాదించారు.
Read Also: Kerala High Court: ‘‘ముస్లిం యువతి షేక్ ల్యాండ్’’.. ఆరోపణలు చేసిన వ్యక్తికి షాక్..
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి అత్యధికంగా (74) పరుగులు చేశాడు. 34 బంతుల్లో 74 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 7 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్లో రింకు సింగ్ కూడా అర్ధ సెంచరీతో (53) పరుగులతో రాణించాడు. అభిషేక్ శర్మ (15), సంజూ శాంసన్ (10), సూర్య కుమార్ యాదవ్ (8), హార్ధిక్ పాండ్యా (32), రియాన్ పరాగ్ (15), అర్ష్దీప్ సింగ్ (6) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. ముస్తాఫిజుర్ రెహమన్ 2 టస్కిన్ అహ్మద్ 2, తంజీమ్ హసన్ 2 వికెట్లు తీశారు. కాగా.. టీమిండియా ఈ విజయంతో 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి టీ 20 మ్యాచ్ హైదరాబాద్లో ఈ నెల 12న జరుగనుంది.
Read Also: Delhi: రాహుల్, ఖర్గేను కలిసిన సీఎం హేమంత్, కల్పన దంపతులు
- Tags
- Bangladesh
- cricket
- india
- second t20
- won
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!