Jammu Kashmir: లష్కరే ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు. రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తూ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. జమ్మూలోని నర్వాల్ లో ఇటీవల జరిగిన జంట పేలుళ్ల కేసులో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Pakistan: పెషావర్ మసీదు పేలుడు.. అందుకే తనిఖీ చేయలేదంటున్న పాక్ అధికారులు..
Also Read
- New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
- Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
పెర్ఫ్యూమ్ బాటిళ్లలో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)లను పోలీసులు అతడిని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్, పాకిస్తానీ హ్యాండ్లర్ ఇచ్చే ఆదేశాలతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి పాల్పడుతున్నాడు. గతంలో వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి నలుగురి మృతికి కారణం అయ్యాడు. ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో తన ప్రమేయం ఉన్నట్లు ఆరిఫ్ పోలీసుల ముందు అంగీకరించాడు. 2022 ఫిబ్రవరిలో జమ్మూలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో, జనవరి 21న నర్వాల్ లో జరిగిన జంట పేలుళ్లలో ఇతనికి సంబంధం ఉంది. పేలుడుకు ఉపయోగించిన ఐఈడీలు అన్ని పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ లోకి వచ్చినట్లు తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
-
Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
-
LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
-
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!