CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు దిశా నిర్దేశం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం
- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు,
- రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు.. జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పవన్ దిశానిర్దేశం చేశారు.
School ground: విద్యావ్యవస్థకే మాయనిమచ్చ.. మద్యం సేవించి స్కూల్లో పడ్డ ప్రిన్సిపాల్, టీచర్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
సమావేశం అనంతరం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం.. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేసారు.. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులున్నాయని తెలిపారు. పెట్టుబడులను తీసుకురావడంలో కేంద్రంతో అనుసంధానం చేసి పూర్తి చేయడంలో ముందుండాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. పలు అంశాల పరిష్కారం వైపు నడిపించాలని సీఎం దిశా నిర్దేశం చేసారన్నారు. బ్రాండ్ ఏపీని రీ క్రియేట్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.. 25 పాలసీలు తీసుకురావడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జగన్ ఒక ఎస్కోబార్ లా తయారయ్యాడు.. ఆర్ధిక అసమతుల్యత ఎప్పుడు వచ్చినా ఏపీపై మాట్లాడుతున్నారు.. అన్నీ జగన్ చుట్టే తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
IND vs AUS: సిరాజ్ను రెచ్చగొట్టిన లబుషేన్.. అతని దగ్గరికి వెళ్లి ఏం చేశాడంటే..? (వీడియో)
ఎంపీ లావు కృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మాట్లాడాల్సిన అంశంపై చంద్రబాబు దిశ నిర్దేశం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా తాము ఏపీ పరిస్థితి వివరించామని తెలిపారు. ఏపీ విజన్ డాక్యుమెంట్, 6 ఇండస్ట్రీయల్ పాలసీలపై మాట్లాడతామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారినే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారిని కూడా ఒప్పించాలి.. పోలవరం, రాయలసీమకు వచ్చి ఆగిపోయినవి, నదుల అనుసంధానం పై సమావేశాలలో మాట్లాడతామని ఎంపీ తెలిపారు. చాలామంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు.. రాబోతున్న బిల్స్ పైన కూడా చర్చ జరిగిందని లావు కృష్ణదేవరాయులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!