సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు.. జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.