TDP: చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా నేతలు.. టార్గెట్ కేశినేని నాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కేశినేని నాని వెంట స్వామిదాస్ మినహా ఎవ్వరూ వెళ్లడం లేదని కృష్ణా జిల్లా నేతలు తెలిపినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఇంకొందరు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బొప్పన భవకుమార్ వైసీపీకి రాజీనామా చేశారని సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కేశినేని నాని విషయంలో టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నామని బెజవాడ పార్లమెంట్ టీడీపీ నేతలు చెప్పినట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
Read Also: Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈ రాష్ట్రం బాగుపడాలంటే నాలా తెలుగుదేశంలో ఉండటమే సబబని నా పాత వైసీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని తెలుగుదేశం గన్నవరం ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజల నాడి తెలుసుకున్న వైసీపీ నేతలు తనతో చాలా బాధలు చెప్పుకుంటున్నారని ఆయన వెల్లడించారు. 94 ప్రభంజనం పునరావృతం అయ్యేలా ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితి ఉందన్నారు. 89లో తెలుగుదేశం గెలిచింది రెండు ఎంపీ స్థానాలే అయినా, 94లో ఏం జరిగిందో చరిత్ర చెప్తోందన్నారు. వైసీపీ శ్రేణులకు నేను అన్నం పెడితే, ఆపార్టీ నాకు సున్నం పెట్టిందని ఆయన విమర్శించారు. రౌడీ షీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందని ఆయన ఆరోపించారు. పనికి రాని మంత్రుల్ని పెట్టుకోవటం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికొచ్చి గొడవ చేస్తేనో.. నోటికొచ్చినట్టు బూతులు తిడితేనో మంత్రి పదవులిచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి శాఖాపరంగా చేసిన ఒక్క సమీక్ష అయినా ఉందా అంటూ ప్రశ్నంచారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలెవ్వరికీ అర్ధం కావట్లేదన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..