TDP: చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా నేతలు.. టార్గెట్ కేశినేని నాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కేశినేని నాని వెంట స్వామిదాస్ మినహా ఎవ్వరూ వెళ్లడం లేదని కృష్ణా జిల్లా నేతలు తెలిపినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఇంకొందరు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బొప్పన భవకుమార్ వైసీపీకి రాజీనామా చేశారని సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కేశినేని నాని విషయంలో టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నామని బెజవాడ పార్లమెంట్ టీడీపీ నేతలు చెప్పినట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
Read Also: Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ రాష్ట్రం బాగుపడాలంటే నాలా తెలుగుదేశంలో ఉండటమే సబబని నా పాత వైసీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని తెలుగుదేశం గన్నవరం ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజల నాడి తెలుసుకున్న వైసీపీ నేతలు తనతో చాలా బాధలు చెప్పుకుంటున్నారని ఆయన వెల్లడించారు. 94 ప్రభంజనం పునరావృతం అయ్యేలా ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితి ఉందన్నారు. 89లో తెలుగుదేశం గెలిచింది రెండు ఎంపీ స్థానాలే అయినా, 94లో ఏం జరిగిందో చరిత్ర చెప్తోందన్నారు. వైసీపీ శ్రేణులకు నేను అన్నం పెడితే, ఆపార్టీ నాకు సున్నం పెట్టిందని ఆయన విమర్శించారు. రౌడీ షీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందని ఆయన ఆరోపించారు. పనికి రాని మంత్రుల్ని పెట్టుకోవటం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికొచ్చి గొడవ చేస్తేనో.. నోటికొచ్చినట్టు బూతులు తిడితేనో మంత్రి పదవులిచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి శాఖాపరంగా చేసిన ఒక్క సమీక్ష అయినా ఉందా అంటూ ప్రశ్నంచారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలెవ్వరికీ అర్ధం కావట్లేదన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!