IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల.. 13 ఏళ్ల వయస్సులోనే..
- ఐపీఎల్ మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల
- అత్యంత వయసున్న ఆటగాడిగా ఇంగ్లండ్కు చెందిన జేమ్స్ అండర్సన్
- అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ
- అందరి దృష్టి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లపైనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించనున్న మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మెగా వేలం నిర్వహించనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ మెగా వేలంలో వేలం వేయడానికి 204 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్లను తయారు చేశారు. ఇది కాకుండా, వేలంలో ఎంపికైన 204 మంది ఆటగాళ్లలో, అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు భారత్కు చెందినవాడు కాగా, అత్యంత వయస్సు గల ఆటగాడు ఇంగ్లండ్కు చెందినవాడు. మెగానే వేలంలో పాల్గొనే ఈ ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.
Read Also: Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఇంగ్లండ్కు చెందిన జేమ్స్ అండర్సన్ అత్యంత వయసున్న ఆటగాడు
ఈసారి ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నాడు. అండర్సన్ చివరిసారిగా 2014లో టీ-20 మ్యాచ్ ఆడాడు. 42 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ రూ.1.25 కోట్లకు ఐపీఎల్ వేలం జాబితాలో తనను తాను నమోదు చేసుకున్నాడు. ఈ విధంగా వేలంలో అత్యంత వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఇది మాత్రమే కాదు, ఏదైనా జట్టు అతన్ని ఎంపిక చేస్తే, అండర్సన్ మొదటిసారి ఐపీఎల్ ఆడతాడు.
అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్
జేమ్స్ ఆండర్సన్ కాకుండా వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. 13 ఏళ్ల వైభవ్ బీహార్ తరఫున ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, భారత అండర్-19 జట్టు తరఫున మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19పై కూడా సెంచరీ సాధించాడు.
Read Also: IND vs SA: స్వదేశంలో సఫారీలు చిత్తు.. 135 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
అందరి దృష్టి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లపైనే..
ఐపీఎల్ 2025 కోసం మెగా వేలంలో అందరి దృష్టి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లపై ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు గత సీజన్లో తమ తమ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇది కాకుండా, వేలంలో కేఎల్ రాహుల్పై కూడా పెద్ద బిడ్ వేయవచ్చు. అదే సమయంలో మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ వంటి ఆటగాళ్లపై డబ్బు వర్షం కురిపిస్తుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?