Talasani Srinivas Yadav: బాంచన్ కాళ్లు మొక్కుతా రోజులు పోయాయి.. తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు!
- బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుంది
- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు
- బాంచన్ కాళ్లు మొక్కుతా రోజులు పోయాయి
- మాజీ మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav slams Congress over BC Reservation: రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే అని గుర్తుచేశారు. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు?, ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారని ఎద్దేవా చేశారు. బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్ మాల్ చేస్తున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
‘రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయి. అందరం బీసీ నినాదంతో ముందుకు వెళ్దాం. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు. ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టి సవరణ చేస్తేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని అసెంబ్లీలో చెప్పాను. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని సీఎం చెప్పారు. ఇప్పటికి అతిగతి లేదు. వంద రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం చెప్పడంతో హరిబరిగా జీవోలు ఇస్తున్నారు. ఆర్డినెన్స్ పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారు. ఆర్డినెన్స్ చెల్లదని తెలిసి మంత్రులు, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని చెబుతున్నారు’ అని తలసాని అన్నారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: ENG vs IND: ‘ఒక్క ఛాన్స్’ ప్లేయర్ ఔట్.. నాలుగో టెస్ట్ భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
‘బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్ మాల్ చేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. మేము బిచ్చగాళ్లము కాదు.. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సహకరిస్తాం. మేమేంతో మాకు అంత ఇవ్వాలి. త్వరలోనే తెలంగాణలో బీసీ ఉద్యమం రాబోతుంది. ఒకప్పుడు బాంచన్ కాళ్లు మొక్కుతాం అని బీసీలు అనేవాళ్లు.. ఇప్పుడు బీసీలు అలా లేరు. మా గౌరవంకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోం. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోయితే మీ అధికారాన్ని మేము తీసుకుంటాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!