Bhatti Vikramarka : ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది
- సర్వే పకడ్బందీగా జరిగింది
- ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం
- ఛాలెంజ్గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది
- ఎవరికి సందేహం అవసరం లేదు
- ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా జరిగిందన్నారు. ఫైనల్ గా బీసీ జనాభా 56 శాతమని, కేటీఆర్ లాంటి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు. నేను పాల్గొంట అని సభలో.. బయట అడిగారని, కాబట్టి మళ్ళీ వారం గడువు ఇచ్చామని ఆయన తెలిపారు. ఛాలెంజ్ గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందని, ఎవరికి సందేహం అవసరం లేదన్నారు భట్టి విక్రమార్క. అందరికీ సమాధానం చెప్పండని, ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మనం ఇంత చేసినా కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమాజం రాజకీయ ప్రేరేపితం కాబట్టి అంటుంటారని, బీఆర్ఎస్.. బీజేపీ బాగోలేదు అని చెప్పడంతో.. బీసీలకు లబ్ధి చేయొద్దు అని ఆలోచనతో.. అందుకే బాగోలేదు అంటున్నారన్నారు.
Amaravati: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
ఇది మనకు టార్చ్ లాంటిదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దాన్ని అందుకుని ముందుకు పోవాలని, సీఎం రేవంత్ నీ అభినందిస్తున్నామన్నారు. సామాజిక సర్వే చేస్తే వచ్చే ఇబ్బందులు ఉంటాయని, కానీ రేవంత్ రాహుల్ గాంధీ అజెండానే నా అజెండా అని చెప్పారన్నారు. చాలా స్పష్టంగా ఉన్నారు సీఎం అని, సామాజిక న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పారు సీఎం అని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్.. బీజేపీ కుట్ర చేస్తున్నాయని, బీసీలకు ఆ ఫలాలు అందొద్దు అని వారి ఆలోచన అని ఆయన విమర్శించారు. బీసీ లు చైతన్యవంతులుగా ఉండండని, బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందని భయంతో ఉంది.. అందుకే తప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ.. దేశ వ్యాప్తంగా సర్వే చేయాల్సి వస్తుంది అని బీజేపీ అడ్డుకుంటుందని, సర్వే అంతా నేనే దగ్గర ఉండి చూశానని, తప్పులు ఎక్కడ జరగలేదని ఆయన పేర్కొన్నారు.
Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!