Bhatti Vikramarka : ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం.. సర్వే పకడ్బందీగా జరిగింది
- సర్వే పకడ్బందీగా జరిగింది
- ఫైనల్గా బీసీ జనాభా 56 శాతం
- ఛాలెంజ్గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది
- ఎవరికి సందేహం అవసరం లేదు
- ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ప్రజాభవన్లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్వే పకడ్బందీగా జరిగిందన్నారు. ఫైనల్ గా బీసీ జనాభా 56 శాతమని, కేటీఆర్ లాంటి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదని ఆయన పేర్కొన్నారు. నేను పాల్గొంట అని సభలో.. బయట అడిగారని, కాబట్టి మళ్ళీ వారం గడువు ఇచ్చామని ఆయన తెలిపారు. ఛాలెంజ్ గా తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిందని, ఎవరికి సందేహం అవసరం లేదన్నారు భట్టి విక్రమార్క. అందరికీ సమాధానం చెప్పండని, ఇంత బాగా సర్వే చేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మనం ఇంత చేసినా కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమాజం రాజకీయ ప్రేరేపితం కాబట్టి అంటుంటారని, బీఆర్ఎస్.. బీజేపీ బాగోలేదు అని చెప్పడంతో.. బీసీలకు లబ్ధి చేయొద్దు అని ఆలోచనతో.. అందుకే బాగోలేదు అంటున్నారన్నారు.
Amaravati: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ఇది మనకు టార్చ్ లాంటిదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దాన్ని అందుకుని ముందుకు పోవాలని, సీఎం రేవంత్ నీ అభినందిస్తున్నామన్నారు. సామాజిక సర్వే చేస్తే వచ్చే ఇబ్బందులు ఉంటాయని, కానీ రేవంత్ రాహుల్ గాంధీ అజెండానే నా అజెండా అని చెప్పారన్నారు. చాలా స్పష్టంగా ఉన్నారు సీఎం అని, సామాజిక న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పారు సీఎం అని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్.. బీజేపీ కుట్ర చేస్తున్నాయని, బీసీలకు ఆ ఫలాలు అందొద్దు అని వారి ఆలోచన అని ఆయన విమర్శించారు. బీసీ లు చైతన్యవంతులుగా ఉండండని, బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందని భయంతో ఉంది.. అందుకే తప్పులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీజేపీ.. దేశ వ్యాప్తంగా సర్వే చేయాల్సి వస్తుంది అని బీజేపీ అడ్డుకుంటుందని, సర్వే అంతా నేనే దగ్గర ఉండి చూశానని, తప్పులు ఎక్కడ జరగలేదని ఆయన పేర్కొన్నారు.
Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి
తాజావార్తలు
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?