Harish Rao : తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి
- ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనం
- సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ
- రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏకపక్షంగా తరలించుకుంటూ తెలంగాణకు నష్టం కలిగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్చలంగా చూస్తుండటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హరీష్ రావు పేర్కొన్నట్టుగా, గత మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ రోజుకు 10వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తోంది. ఏడాది మొత్తంగా ఇది 646 టీఎంసీలకు చేరుకుంటుంది. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తాగునీటి అవసరాలకు, సాగర్ జలాశయంలో నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ బలవంతంగా తరలించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చైతన్యం లేదని హరీష్ రావు మండిపడ్డారు.
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్లో పవర్ స్టార్ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
నాగార్జున సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పటికీ, ఏపీ ఇష్టానుసారంగా నీటిని తరలించుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలిన నీటి నిల్వలు తగ్గిపోతున్నా, పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ మరింత నీటిని తరలించేందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై కేఆర్ఎంబీ పరిధిలో త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ మీటింగ్ జరగకపోవడం, కేంద్ర బోర్డు పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.
CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు
ఏపీ దూకుడుకు, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెగబడ్డ ప్రభావం ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ కావడమేనని హరీష్ రావు ఆరోపించారు. వేసవి తాకిడి ప్రారంభమవకముందే తెలంగాణ రైతులు నీటి కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఏపీ సాగర్ ఆయకట్టుకు ముప్పుగా మారేలా నీటిని తరలిస్తుండటం సరికాదని, వెంటనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఈ దోపిడిని అడ్డుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సాగర్ లో నీటి మట్టం పడిపోతే, హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి, తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!