Gangula Kamalakar : కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
- జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్లో ఫెయిల్ అయ్యారు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
- ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు : గంగుల కమలాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, గతంలో జిల్లా పరిషత్ లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంచార్జీ మంత్రి కంట్రోల్ చేసేవారన్నారు. నిన్న జరిగిన ఘటనలో ముగ్గురు మంత్రులు ఉండి జరిగిన ఘటనను కంట్రోల్ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు.
Trinadha Rao: నోటి దురద కామెంట్స్.. చిక్కుల్లో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు?
Also Read
ఏ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలపై పోలీసులు ఇలా దాడి చేయలేదని, వారి ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలో ఏం జరిగింది తెలుసుకోకుండా లాక్కుపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అధికారులతో అక్రమ కేసులు పెట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారని, కరీంనగర్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు బలం ఉందని ఎదురిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. మంత్రుల అనుమతులు లేకుండానే పోలీసులు వేదిక మీదకు వచ్చారా అని ఆయన అన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన దళిత బంధు విషయం పై ప్రశ్నించడం జరిగిందని, అక్రమ కేసులకు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.
Pakistan : మూడేళ్లలో అద్భుతాలను సృష్టించనున్న పాకిస్తాన్.. ఇంతకు అసలు సంగతి ఏంటంటే ?
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!