CM Revanth Reddy: ఎన్ పెద్దిరాజు వర్సెస్ రేవంత్ రెడ్డి కేసు.. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
- ఎన్ పెద్దిరాజు వర్సెస్ రేవంత్ రెడ్డి కేసు
- సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశాడు ఎన్ పెద్దిరాజు. అతడు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. ఎన్ పెద్దిరాజుతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి ఆర్ గవాయ్ పిటీషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిజేఐ ఆదేశించారు.
Also Read:CM Chandrababu: ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన సీఎం..
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు సాక్షిగా క్షమాపణ కోరాడు. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోరాడు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోర్టు ధిక్కరణ నోటీస్ పై వ్రాత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది అని తెలపింది. తదుపరి విచారణ ఆగస్టు 11 కు వాయిదా వేసింది.
Also Read:Karnataka: ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
వారం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చారు హైకోర్టు జస్టిస్ ఎం భట్టాచార్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఎన్ పెద్దిరాజు. 2016 లో గోపనపల్లి భూములకు సంబంధించిన వ్యవహారంలో కేసు .. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఎస్సీ మ్యూచువల్లి ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ… గోపనపల్లి లోని సర్వే నెంబర్ 127 లో, అక్రమంగా చొరబడి జెసిబి లతో నిర్మాణాలను కూల్చారని కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి తో పాటు మరి కొంతమంది స్పాట్లో ఉన్నారని కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు.. కులం పేరుతో దూషించారని కేసు పెట్టాడు పెద్దిరాజు.. అంతా రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే చేశారని పెద్దిరాజు ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..