Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. తెలంగాణలో ఎండలు.. ఏపీలో పలు జిల్లాలకి వర్ష సూచన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిపర్జాయ్ తుఫాను తీవ్ర ప్రభావం నైరుతీ రుతుపవనాలపై చూపించింది. వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావడంతో.. రుతుపవనాల్లో చల్లదనం మాయమైంది. వాటి కదలిక కూడా నెమ్మదిగా సాగుతుంది. దీని వల్లే రుతుపవనాల వల్ల వర్షాలు కురవట్లేదు. మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు బిపర్జాయ్ తుఫాన్ ప్రభావం పోవడంతో.. ఇకపై రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, జిల్లాలో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయనీ… అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కోస్తా ఆంధ్రలో కూడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల వానాలు పడతాయి అని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటూ కొన్ని జిల్లాల్లో వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
Read Also: Kedarnath: కేదార్నాథ్లో బంగారం కుంభకోణం.. పూజారి ఆరోపణతో కలకలం..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ప్రస్తుతం తీరానికి దగ్గర్ లో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని వల్ల రాయల సీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఆకాశం కొద్దిగా మేఘాలతో నిండివుంది. అలాగనీ ఈ మేఘాలపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం దండగా.. ఎండ ఎక్కువగా వస్తే.. ఈ మేఘాలు వర్షాలను కురిపించే అవకాశం తక్కువగా ఉంటుంది.. అందువల్ల మనం అప్పుడే ఎండలు తొలగిపోతాయని అనుకోవద్దని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు అంటున్నారు. ఇక.. తెలంగాణలో కూడా నేటి నుంచి చాలా తక్కువ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. అయితే… వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరో 3 రోజులు కొనసాగుతాయన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలనీ, వీలైనంతవరకూ ఎండలో తిరగకూడదని కోరారు.
Read Also: DRDO Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 181 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను భారత వాతావరణ విభాగం జారీ చేసింది.. ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, , హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలు. ఈ జిల్లాల్లో ప్రజలు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే నమోదవుతుంది. ఎండల తీవ్రత మరో 5 రోజులపాటూ ఇలాగే ఉంటాయి అని భారత వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!