Soldiers Bus Accident: కారును ఢీకొట్టిన సైనికులు ప్రయాణిస్తున్న బస్సు.. ముగ్గురు మృతి, 26 మందికి గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్పూర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 1 గంటకు ఈ ప్రమాదం జరిగింది.
Also Read: X Blue Tick: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకపై వారికి ‘బ్లూ టిక్’ కు నో పేమంట్స్..!
Also Read
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
రాష్ట్ర పోలీసు 35వ బెటాలియన్ ఆఫ్ SAF ను మాండ్లా నుండి పంధుర్నా (చింద్వారా) కి సిబ్బందిని తీసుకువెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37) అక్కడికక్కడే మృతి చెందినట్లు కియోలారి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి చైన్ సింగ్ ఉయికే తెలిపారు. మృతులు మండల వాసులని., గాయపడిన మరో ఇద్దరు కారు ప్రయాణికులు కియోలారి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: Mission Bhagiratha: మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ భేటీ
కారులో ప్రయాణిస్తున్న వారు నాగ్పూర్ నుండి ఆసుపత్రికి సంబంధించిన పని ముగించుకుని తిరిగి వస్తున్నారని అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్ఏఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. దీనితో మొత్తం 26 మంది ఎస్ఏఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దాంతో వెంటనే వారిని అధికారులు కియోలారి ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒకరిని నాగ్పూర్ కు తరలించామని, ఘటనపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!