Singireddy Niranjan Reddy : పథకాలను ప్రజలకు చేరవేసినా ఫలితం కనపడకుండా పోయింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఓడిన స్థానాల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మనం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసామని, అయినా ఫలితం అన్నది కనపడకుండా పోయిందన్నారు నిరంజన్ రెడ్డి. మనం తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన తెలంగాణా రాష్ర్టాన్ని చాలా రంగాల్లో అగ్రగామిగా నిలిపామని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రైతు బంధు, రైతు భీమా పథకాలు మంచి గుర్తింపు తెచ్చినవని, రాష్ట్ర విభజన కు ముందు మనం పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు నిరంజన్ రెడ్డి. మన ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, దుష్ప్రచారం, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా లో వచ్చిన అసత్య ప్రచారం ప్రధాన కారణమని ఆయన అన్నారు.
కొంతమంది ఆటో సోదరులు ప్రగతి భవన్ వద్ద ఆటోను తగలబెట్టిన ఒక్క మీడియా కూడా ఆ వార్త ను కవర్ చెయ్యలేదన్నారు. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రాష్ట్రాన్నే తగులబెట్టెవారని ఆయన అన్నారు. ఆనాడు ఇంద్రవెల్లి సభను అడ్డుకుని ఆదివాసీ లను పిట్టలను కాల్చినట్లు కాల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. కానీ నిన్న బోయి సభ పెడితే ఒక్క పేపర్ కానీ, ఒక్క మీడియా కానీ అనాటి కాల్పుల గురించి ప్రస్తావన చేయలేదని ఆయన మండిపడ్డారు. ఆదివాసీ లపై కాల్పులు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం.. గద్దర్ పై కాల్పులు జరిపింది తెలుగు దేశం ప్రభుత్వమన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు అన్ని కేసీఆర్ ను ఓడించి జబ్బులు చర్చుచుకుంటున్నారని, ఈ జిల్లా లో ఒకాయన మాట్లాడుతుండు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది అంటే అది తెలుగు దేశం పార్టీ కార్యకర్తల గొప్ప తనం అని అంటున్నారని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లపై ఈ కొత్త ప్రభుత్వం సంతకాలు చేయడం సిగ్గు చేటన్నారు నిరంజన్ రెడ్డి.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?