Sidhu Moosewala: లోక్సభ బరిలోకి సిద్ధూ మూసేవాలా తండ్రి.. ఎక్కడ్నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ రాష్ట్ర కాంగ్రెస్ స్వాగతించింది. బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాగతిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. పంజాబ్లో మాత్రం చివరి దశలో.. అనగా జూన్ 1న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ ఇండియా కూటమిలో ఆప్-కాంగ్రెస్ ఉన్నప్పటికీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇక బటిండా నియోజకవర్గం నుంచి సిద్ధూ మూసేవాలా తండ్రి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి చేస్తారా? లేదంటే స్వతంత్రంగా చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బటిండా స్థానం గత కొన్నేళ్లుగా శిరోమణి అకాలీదళ్కు కంచుకోటగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ సింధు బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నుంచి గుర్మీత్ సింగ్ ఖుదీయాన్ రంగంలోకి దించింది. ఇలా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 2019లో శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్పై గెలిచారు.
ఇది కూడా చదవండి: CDS: “ప్రజల డబ్బును బలవంతంగా డిపాజిట్ చేయించిన కాంగ్రెస్”.. ఆ చట్టం ఏంటీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు విమర్శిస్తోంది..
సిద్ధూ మూసేవాలా 2021, డిసెంబర్లో కాంగ్రెస్లో చేరారు. 2022లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 28 ఏళ్ల వయసులో 2022, మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా మరణించారు. ఇదిలా ఉంటే ఇటీవలే సిద్ధూ మూసేవాల తల్లి సరోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కేంద్రం కూడా అధికారుల నుంచి సమాచారం కోరింది. ఇక తాజాగా బల్కౌర్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తు్న్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే బటిండా నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: X TV: వీడియోల కోసం.. యూట్యూబ్కు పోటీగా ‘ఎక్స్’ టీవీ యాప్..
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!