Sidhu Moosewala: లోక్సభ బరిలోకి సిద్ధూ మూసేవాలా తండ్రి.. ఎక్కడ్నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆ రాష్ట్ర కాంగ్రెస్ స్వాగతించింది. బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వాగతిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
Also Read
పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. పంజాబ్లో మాత్రం చివరి దశలో.. అనగా జూన్ 1న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ ఇండియా కూటమిలో ఆప్-కాంగ్రెస్ ఉన్నప్పటికీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఇక బటిండా నియోజకవర్గం నుంచి సిద్ధూ మూసేవాలా తండ్రి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారన్నది క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ నుంచి చేస్తారా? లేదంటే స్వతంత్రంగా చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే బటిండా స్థానం గత కొన్నేళ్లుగా శిరోమణి అకాలీదళ్కు కంచుకోటగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ సింధు బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ నుంచి గుర్మీత్ సింగ్ ఖుదీయాన్ రంగంలోకి దించింది. ఇలా బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 2019లో శిరోమణి అకాలీదళ్కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్పై గెలిచారు.
ఇది కూడా చదవండి: CDS: “ప్రజల డబ్బును బలవంతంగా డిపాజిట్ చేయించిన కాంగ్రెస్”.. ఆ చట్టం ఏంటీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు విమర్శిస్తోంది..
సిద్ధూ మూసేవాలా 2021, డిసెంబర్లో కాంగ్రెస్లో చేరారు. 2022లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 28 ఏళ్ల వయసులో 2022, మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు జరిపిన కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా మరణించారు. ఇదిలా ఉంటే ఇటీవలే సిద్ధూ మూసేవాల తల్లి సరోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కేంద్రం కూడా అధికారుల నుంచి సమాచారం కోరింది. ఇక తాజాగా బల్కౌర్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తు్న్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే బటిండా నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: X TV: వీడియోల కోసం.. యూట్యూబ్కు పోటీగా ‘ఎక్స్’ టీవీ యాప్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!