Sidhu MooseWala Case: ప్రభుత్వం ఇవ్వలేకపోతే నేను 2 కోట్లు చెల్లిస్తాను.. సిద్ధూ మూసేవాలా తండ్రి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidhu MooseWala Case: పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఇవ్వలేకపోతే తన జేబులో నుంచి పారితోషికం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని బల్కౌర్ సింగ్ తెలిపారు. అమృత్సర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఓ మహిళను చంపి ఆ దేశం నుంచి పారిపోయిన భారతీయ సంతతికి చెందిన పౌరుడిని అరెస్టు చేసినందుకు ఆస్ట్రేలియా పోలీసులు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను రివార్డును ప్రకటించిన ఉదాహరణను ఉదహరించారు. గోల్డీ బ్రార్ను భారత్కు తీసుకువచ్చి అతని నేరాలకు గానూ చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మే 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ కాల్చి చంపబడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు.అప్పట్లో గాయకుడు రూ.2 కోట్లు పన్నుగా చెల్లించేవాడని సిద్ధూ మూసేవాలా తండ్రి పేర్కొన్నాడు, గ్యాంగ్స్టర్ అరెస్టుకు దారితీసే సమాచారం కోసం రివార్డ్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అతన్ని పట్టుకోవడంలో సహాయం చేసిన వారికి రూ.2కోట్ల రివార్డు ఎందుకు ప్రకటించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంత డబ్బు ప్రభుత్వం చెల్లించలేకపోతే తన భూమిని అమ్మి అయినా చెల్లిస్తానని ఆయన చెప్పారు.
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 9,168 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
విదేశాల్లోకి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకునేందుకు వీలుగా గోల్డీ బ్రార్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్కు చెందిన సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. ఆ నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో చురుకైన సభ్యుడు. గత నెలలో డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో గోల్డీ బ్రార్ కూడా కీలక సూత్రధారి అని పోలీసులు తెలిపారు.
#SidhuMooseWala Father Balkaur today in Amritsar said Govt should announce a 2 crore reward on the gangster like Goldy Brar. If the Govt didn't have money to give the reward, I will give the reward by selling my land.#Punjabi #Punjab pic.twitter.com/EqBQriYLyw
— Akashdeep Thind (@thind_akashdeep) December 1, 2022
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!