గతంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు..ఏమైందని ప్రశ్నించారు. ఇస్లామిక కల్చరల్ సెంటర్స్ , మైనారిటీలకు ఇల్లు అన్నారు ..ఏ ఒక్కటి కాలేదని ఆయన మండిపడ్డారు. మేము మైనారిటీలకు 55 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆరు మాత్రమే ఉన్నాయని, మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యమన్నారు షబ్బీర్ అలీ. మైనార్టీలకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రెండు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరికి సహాయం చేయలేదన్నారు షబ్బీర్ అలీ.
రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ,ప్రియాంక యూత్ డిక్లరేషన్స్, సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ విడుదల చేశారని, త్వరలో మైనార్టీ ,బిసి, డిక్లరేషన్స్ రాహుల్ ,ప్రియాంక గాంధీ లచేత విడుదల చేస్తామన్నారు షబ్బీఆర్ అలీ.
Also Read : IND vs SL: భారత్-శ్రీలంక ప్రపంచకప్ సమరం.. లాస్ట్ 5 మ్యాచ్లలో ఎవరిది పైచేయంటే?
అంతేకాకుండా.. ‘5000 కోట్లతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించాం.. ముస్లిం రిజర్వేషన్స్ పెంపు కోసం లీగల్ గా వెళ్తాం.. 4 శాతం రిజర్వేషన్స్ కి పూర్తిగా ప్రైటెక్షన్ కల్పిస్తాం. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సహాయం.. మైనార్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రేపు లేదా ఎల్లుండి మిగిలిన అభ్యర్థుల లిస్ట్ వస్తది.. నేను ఎక్కడ పోటీ చేయాలని సిఈసీ నిర్ణయం తీసుకుంటుంది.. ముస్లిం రిజర్వేషన్స్ పెంపు కోసం లీగల్ గా వెళ్తాం. 4 శాతం రిజర్వేషన్స్ కి పూర్తిగా ప్రొటెక్షన్ కల్పిస్తాం. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సహాయం అందజేస్తాం’ అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
Also Read : Exit Poll: నవంబర్ 30 సాయంత్రం 6.30 వరకు.. ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం..