Karnataka: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా శిరూర్లో ఘటన
- వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో మరో ఇద్దరు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే.. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఉత్తర కన్నడ జిల్లా శిరూర్లో మంగళవారం వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
Read Also: Puja khedhkar: ట్రైనీ ఐఏఎస్ పూజాకు బిగ్ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఆదేశాలు
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
మృతులు 66వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే చిన్నపాటి హోటల్ నడుపుతున్న కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరంతా బురదలో కూరుకుపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో.. ఓ గ్యాస్ ట్యాంకర్ కూడా సమీపంలోని గంగావళి నదిలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో.. సంఘటన సమయంలో దుకాణం వద్ద టీ తాగుతున్న వాహనం డ్రైవర్, క్లీనర్ కనిపించకుండా పోయారన్నారు. మొత్తంగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది.
Read Also: Amit Shah: కాంగ్రెస్ ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకమే..
కొండ చరియలు విరిగిపడటంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు . కార్వార్ ఎమ్మెల్యే సతీష్ సైల్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. తనకు అందిన నివేదిక ప్రకారం కొండచరియలు విరిగిపడి గంగావళి నదిలో 10-15 మంది పడే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని నివేదిక కోరామని, దీనిపై తర్వాత చెబుతామని దేవాదాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ సభకు తెలిపారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!