Puja khedhkar: ట్రైనీ ఐఏఎస్ పూజాకు బిగ్ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఆదేశాలు
- ట్రైనీ ఐఏఎస్ పూజాకు బిగ్ షాక్
- శిక్షణ నిలిపివేస్తూ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు బిగ్ షాక్ తగిలింది. శిక్షణ నిలిపివేస్తూ తాజాగా సాధారణ పరిపాలనా విభాగం నుంచి ఆమెకు ఆదేశాలు వెళ్లాయి. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు పిలిపించింది. దీంతో పూజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇటీవలే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆమెను పూణె నుంచి వాషిమ్కు బదిలీ చేశారు. కానీ తవ్వేకొద్దీ… రోజుకో కొత్త ఆరోపణలు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై యాక్షన్కు పూనుకున్నాయి.

Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
పూణెకు ట్రైనీ ఐఏఎస్ అధికారిగా వెళ్లే ముందు పూజా.. అధికారుల్ని బెదిరించి కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసేలా బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఈ వ్యవహారాన్ని పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పూణె నుంచి వాషిమ్కు బదిలీ చేశారు. ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది. కానీ ఆమెపై మాత్రం ఆరోపణలు ఆగలేదు. రోజుకో ఆరోపణ రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ యవ్వారం ఇలా ఉంటే ఆమె తల్లి మనోరమా.. ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. ఇక పూజా చదువు, మెడికల్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి పెట్టినట్లుగా ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది.
ఇక సోమవారం అర్ధరాత్రి ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళా పోలీసుల బృందం పూణెలోని పూజా ఖేద్కర్ నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మహిళా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో పూజా ఏం మాట్లాడారన్నది ఇంకా తెలియలేదు.
ఇదిలా ఉంటే పూజా అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. యూపీఎస్సీలో ఆమె నకిలీ సర్టిపికెట్లు సమర్పించడం.. అలాగే విద్యకు సంబంధించిన పత్రాలు కూడా నకిలీ సమర్పించినట్లుగా కీలక అంశాలు బయటకు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది. సివిల్స్ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో ఖేద్కర్ పూజా దిలీప్రావు అనే పేరుతో ప్రిలిమ్స్ రాయగా.. 2022లో పూజా మనోరమా దిలీప్ ఖేద్కర్ పేరుతో పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్కు ఎంపికైంది. అటు సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్లో చేరినట్లు కాలేజీ యాజమాన్యం తేల్చింది. ఇప్పటికే పూజా ఖేద్కర్ వివాదంపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు వారాల్లో కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
-
Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
-
Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్కు వణుకు పుట్టించిన జపాన్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!