Tirumala: తిరుమలలో భద్రత ప్రశ్నార్థకం..! టీటీడీపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో.. భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్లతో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. భక్తులు సెల్ఫోన్లు, కెమెరాలు వంటి వాటితో శ్రీవారి సన్నిధిలోకి వెళ్లకుండా.. టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే, మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని మరీ.. శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం, ఆ దృశ్యాలు వెలుగుచూడటం వంటి వరుస పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా జరిగిన ఘటనతో తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది.
తిరుమలలో కొద్ది రోజుల క్రితమే శ్రీవారి ఆనంద నిలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు సంచలనం రేపాయి. ఇక ఇటీవల తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారంటూ టీటీడీకి మెయిల్ ద్వారా సమాచారం రావడం.. భద్రతాధికారులు, సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగుచూడటం సంచలనంగా మారింది. ఆలయంలో నలువైపుల నుంచి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన దృశ్యాలు.. తిరుమలలో భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనే దానికి నిదర్శనంగా నిలిచాయి.
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆలయంలోకి కెమెరాతో ఎలా ప్రవేశించారు? ఆనంద నిలయ దృశ్యాలను చిత్రికరించే సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం కొరవడింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు సీరియస్గా స్పందించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆలయ దృశ్యాలను మహిళా భక్తురాలు చిత్రీకరించినట్లుగా భద్రతాధికారులు గుర్తించారు. మొబైల్ ఫోన్తో కాకుండా.. సీక్రెట్ కెమెరాతో వీడియో తీసినట్లుగా కూడా గుర్తించారు. ముందుగా సదరు మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ఆమె ఎవరని తేలితే.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.
అయితే, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు భద్రతా సిబ్బంది. సెల్ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ.. ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి కెమెరా తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, టీటీడీ అధికారులు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!