Hyderabad: నగర శివారులో జోరుగా పసి పిల్లల అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ పసి పిల్లల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పిల్లలు లేని తల్లిదండ్రులు లక్షలు కుమ్మరించి పసి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిరుప్రాయానికి వెల కడుతున్నారు. అన్నెం పున్నెం ఎరుగని బాల్యాన్ని అంగట్లో సరుకును చేస్తున్నారు. కంటికి రెప్పలా సాకాల్సిన కన్నబిడ్డలను డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఒకరి నుంచి మరొకరికి బిడ్డలు చేతులు మారుతూ వెలను మారుస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు చేసిన పిల్లలను కఠినమైన జీవితానికి బలి చేస్తున్నారు.
Read Also: New Rules 2024: అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పెట్రోల్, ఎల్ పీజీ ధరల్లో మార్పులు
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో తల్లీకొడుకుతో పాటు ఇద్దరు ముఠా సభ్యులు ఉన్నారు. మరోవైపు.. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: Praja Bhavan: ప్రజా భవన్కు బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు
వారం రోజుల క్రితం మేడిపల్లిలో చిన్నారిని అమ్ముతుండగా ఓ స్వచ్ఛంధ సంస్థతో కలిసి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంతో మరి కొంత మంది చిన్నారులను పోలీసులు కాపాడారు. చిన్నారులను అమ్మకాలు చేస్తుంది ఓ అంతర్జాతీయ ముఠాగా గుర్తించారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో.. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. మరోవైపు.. రాచకొండ కమిషనరేట్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కమిషనరేట్ వద్దకు వచ్చారు. చిన్నారులను శిశువిహార్ కు తరలిస్తుండటంతో పేరెంట్స్ అడ్డుకున్నారు. తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేశారు. అల్లారుముద్దుగా పిల్లలను పెంచుకుంటున్నామని రోధిస్తున్నారు. శిశువిహార్కు చిన్నారులను తరలిస్తుండటంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు శోభారాణితో పాటు మరి కొంత మంది ఏజెంట్లు లీగల్ అని చెప్పి అమ్మారని పేరెంట్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!