IND vs ENG: రోహిత్ శర్మ స్థానంలో భారీ హిట్టర్.. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నాడు!
- టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్
- రెండు విషయాపై దృష్టి సారించిన బీసీసీఐ
- హిట్మ్యాన్ స్థానంలో ఓపెనర్గా సాయి సుదర్శన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇంగ్లాడ్ పర్యటనకి ముందు హిట్మ్యాన్ టెస్టుల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాపై దృష్టి సారించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్ట్ సారధిని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇప్పటికే టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్గా యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ పేరు వినిపిస్తోంది. 2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటివరకు 32 టెస్టుల్లో 5 సెంచరీలతో 1893 పరుగులు చేశాడు.
మరోవైపు రోహిత్ శర్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతుంది. హిట్మ్యాన్ స్థానంలో ఓపెనర్గా సాయి సుదర్శన్ ఈ పేరును సెలక్షన్ కమిటీ పరిశీలిస్తోందట. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఓపెనర్గా ఆడుతున్న అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. సుదర్శన్ ఫామ్ చూసి టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి ఫిదా అయ్యాడు. ఇలాంటి కుర్రాడు భారత టెస్టు జట్టులోకి రావాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించాడు.
Also Read
Also Read: Team India Captain: జస్ప్రీత్ బుమ్రా కాదు.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ ఎలాంటి ఒత్తిడిలోనైనా సహనం కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు.. దేశవాళీ క్రికెట్లోనూ అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 213. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఓపెనర్గా రాణిస్తున్న భారత ఆటగాళ్లు మరెవరూ లేరు.
తాజావార్తలు
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?