Rohit Sharma: బాధ పెట్టాలని నేను ఎవరినీ తిట్టను: రోహిత్
- కుల్దీప్ యాదవ్పై రోహిత్ శర్మ ఫైర్
- మైదానంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి
- మైదానంలో ఎవరినీ బాధ పెట్టాలని తిట్టను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్, ఫైనల్స్లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయిన విషయం తెలిసిందే. బాల్ వేసిన అనంతరం స్టంప్స్ వెనకే ఉండడం, ఫీల్డర్ త్రో విసిరినా బంతిని పట్టుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో 41వ ఓవర్లో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని వేయగా.. వికెట్లకు దగ్గర నుంచి వెళ్తున్న బంతిని కుల్దీప్ పట్టుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. సెమీస్లో స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని కూడా వదిలేశాడు. దీనిపై సారథి రోహిత్ శర్మ మాట్లాడాడు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… మైదానంలో భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయని, ఆ సమయంలో అప్పుడప్పుడు తాను నియంత్రణను కోల్పోతానని రోహిత్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం బలమైన జట్టు ఉంది. నిబద్ధత కలిగిన వ్యక్తులతో కలిసి ఆడటం ఆనందంగా ఉంది. ప్రతిఒక్కరికి వారి పాత్ర ఏంటి, బాధ్యతలు ఏంటో తెలుసు. మైదానంలో ప్రతిఒక్కరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నేను నియంత్రణ కోల్పోతా. అయితే అదంతా ఆటలో భాగమే. మైదానంలో ఎవరినీ బాధ పెట్టాలని తిట్టను. అందరి లక్ష్యం విజయమే. అందుకు దేనికైనా సిద్దమే’ అని రోహిత్ చెప్పాడు.
Also Read
‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఐదు మ్యాచ్ల్లోనూ మేం టాస్ ఓడిపోయాం. అయినా కూడా టైటిల్ గెలిచాం. ఒక్క మ్యాచ్లోనూ ఓటమి లేకుండా.. విజేతగా నిలవడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. టైటిల్ విజయంలో అందరూ పాలు పంచుకున్నారు’ అని రోహిత్ శర్మ తెలిపాడు. ఫైనల్లో కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (37), విలియమ్సన్ (11)ను ఔట్ చేశాడు. ఫైనల్లో తాను వేసిన మొదటి బంతికే రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!