బర్త్ డే రోజున ఐపీఎల్ లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరపున పుట్టిన రోజున జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోర్.. 2014లో ఐదు బంతులాడి కేవలం 1 పరుగు చేసిన రోహిత్ శర్మ.. 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో 5 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/05/rohit.mp4?_=1Also Read : CM KCR: నేడు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష
అయితే రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం చెలరేగింది. సందీప్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆఫ్ స్టంప్ కంటే ముందు లెగ్ స్టంప్ పైన బెయిల్ లైట్ రావడంతో సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే బెయిల్స్ లేచాయని.. రోహిత్ శర్మ బౌల్డ్ కాలేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే వీడియోలో క్లియర్ గా గమనిస్తే సందీప్ శర్మ వేసి, ఆఫ్ స్టంప్ బెయిల్ ని తాకుతూ వెళ్లింది. ఆఫ్ స్టంప్ బెయిల్ లేచేసరికి లెగ్ స్టంప్ బెయిల్ కదిలి ముందుగా లైట్ వచ్చింది. అదీకాకుండా సంజూ శాంసన్ గ్లవ్స్ కి బెయిల్స్ కి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి అతని గ్లవ్స్ తాకి వికెట్లు కదలలేదు.
Also Read : MLA Kannababu: ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు
దీనికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగుల చేసి అర్షాద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, నడుముపైకి వస్తున్నట్లు క్లియర్ గా కనిపించింది. రూల్స్ ప్రకారం బ్యాటర్ నడుము పైకి వస్తూ.. బెయిల్స్ కంటే పైకి వెళ్లిన బాల్ ని నో బాల్ గా ప్రకటించాలి.. అయితే రోహిత్ శర్మ.. అంపైర్లతో ఏదో మాట్లాడడం ఆ తర్వాత థర్డ్ అంపైర్.. ఆ బాల్ ను కరెక్ట్ బాల్ గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు.