MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని.. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని ఎమ్మెల్యే కవిత మండిపడ్డారు. ఉడతల దండులా.. బయట నేతలు తెలంగాణపై పడ్డట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. పార్ల మెంట్ లో ప్రధాని తెలంగాణ ఆవమానిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదు..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన తేలేదు అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు మన సమస్యలు పట్టని నాయకులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు.? అని ప్రశ్నించారు. నిజామాబాద్ దండ యాత్రకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. 1000 బుల్ డోజర్లకు మా కారు ఒక్కటే సమాధానం అన్నారు. ట్రైలర్ చూసి జాతీయ పార్టీలు భయపడుతున్నాయని తెలిపారు. సింగరేణినీ ప్రైవేట్ కు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని అన్నారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రియాంకా గాంధీ చదువుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు వెంట పడి రైతు బంధు ఆపారని మండిపడ్డారు. రైతులు కేసీఆర్ వైపు ఉన్నారని రైతు బంధు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్..?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కాంగ్రెస్ రైతు వ్యతిరేకంగా వల్లే రైతు బంధు ఆగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని తెలిపారు. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలని మండిపడ్డారు. బీజేపీతో మా శతృత్వం అన్నారు. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అని అంటున్న ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడ్డారని అన్నారు. కేంద్రంలో ఖాలీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని.. యువత అడగాలని పిలుపు నిచ్చారు. మతం పేరుతో మంట పెట్టాలి అని ఒక పార్టీ చూస్తుందని, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుందని అన్నారు. మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కావాలా మైగేశన్ కావాలా? 24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులను ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించారు కేసీఆర్ అని తెలిపారు.
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!