MLC Kavitha: రైతు బంధు ఆపింది కాంగ్రెస్సే.. రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని.. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని ఎమ్మెల్యే కవిత మండిపడ్డారు. ఉడతల దండులా.. బయట నేతలు తెలంగాణపై పడ్డట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. పార్ల మెంట్ లో ప్రధాని తెలంగాణ ఆవమానిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదు..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన తేలేదు అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్నప్పుడు మన సమస్యలు పట్టని నాయకులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు.? అని ప్రశ్నించారు. నిజామాబాద్ దండ యాత్రకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. 1000 బుల్ డోజర్లకు మా కారు ఒక్కటే సమాధానం అన్నారు. ట్రైలర్ చూసి జాతీయ పార్టీలు భయపడుతున్నాయని తెలిపారు. సింగరేణినీ ప్రైవేట్ కు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని అన్నారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రియాంకా గాంధీ చదువుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు వెంట పడి రైతు బంధు ఆపారని మండిపడ్డారు. రైతులు కేసీఆర్ వైపు ఉన్నారని రైతు బంధు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Mohan Bhagwat: అప్పుడు అమెరికా మనల్ని ఎగతాళి చేసేది.. ఇప్పుడు పాకిస్థాన్..?
Also Read
కాంగ్రెస్ రైతు వ్యతిరేకంగా వల్లే రైతు బంధు ఆగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు వెంట బడి రైతు బందును ఆపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకున్నారని తెలిపారు. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలని మండిపడ్డారు. బీజేపీతో మా శతృత్వం అన్నారు. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అని అంటున్న ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడ్డారని అన్నారు. కేంద్రంలో ఖాలీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని.. యువత అడగాలని పిలుపు నిచ్చారు. మతం పేరుతో మంట పెట్టాలి అని ఒక పార్టీ చూస్తుందని, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుందని అన్నారు. మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ కావాలా మైగేశన్ కావాలా? 24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికులను ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించారు కేసీఆర్ అని తెలిపారు.
Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తాజావార్తలు
-
Team India: 200 వికెట్స్ తీసిన విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!