Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?
- కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నన్ను బెదిరించారు- రాహుల్ గాంధీ
- సరదాగా చెప్పిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల తర్వాత లోక్సభలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం రాహుల్ గాంధీ సరదాగా చెప్పారు. కాగా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Panchumarthi Anuradha: “పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే.”
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
నిజానికి.. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి తప్పుకుంటారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయానాడ్ నుంచి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. రాహుల్ గాంధీ పార్టీ సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగనున్నారు. కాగా.. రాహుల్ గాంధీ అంగీకరించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారని ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఇది మరింత చర్చించాల్సిన విషయమని చెప్పారు. అయితే ఇంతలో రాహుల్ గాంధీ నవ్వుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బెదిరించారన్నారు. దీంతో.. అక్కడున్న మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ నవ్వారు.
Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరిచినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రెడిట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నిర్ణయాన్ని పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సరదాగా అన్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా సమాధానం ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!