Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?
- కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నన్ను బెదిరించారు- రాహుల్ గాంధీ
- సరదాగా చెప్పిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల తర్వాత లోక్సభలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం రాహుల్ గాంధీ సరదాగా చెప్పారు. కాగా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Panchumarthi Anuradha: “పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే.”
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
నిజానికి.. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి తప్పుకుంటారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయానాడ్ నుంచి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. రాహుల్ గాంధీ పార్టీ సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగనున్నారు. కాగా.. రాహుల్ గాంధీ అంగీకరించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారని ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఇది మరింత చర్చించాల్సిన విషయమని చెప్పారు. అయితే ఇంతలో రాహుల్ గాంధీ నవ్వుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బెదిరించారన్నారు. దీంతో.. అక్కడున్న మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ నవ్వారు.
Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరిచినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రెడిట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నిర్ణయాన్ని పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సరదాగా అన్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా సమాధానం ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!