Rahul Gandhi: నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీ.. కొత్త చట్టం తీసుకొస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల్లో మండల స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేపై కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓంకార్సింగ్ మార్కమ్ను బరిలోకి దింపింది. ఈ క్రమంలో.. సియోని జిల్లాలోని ధనోరాలో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు గ్యారెంటీ అప్రెంటీస్షిప్ను అందిస్తామని హామీ ఇచ్చారు. తమ మేనిఫెస్టోలో మూడు నాలుగు విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు, వెనుకబడిన తరగతులు, పేద కుటుంబాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాలకు లక్ష రూపాయలను బదిలీ చేయడం వంటివి. ఈ విధంగా తాము ప్రతి నెలా మీ ఖాతాలకు వేల రూపాయలు పంపుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఆశా, అంగన్వాడీ వర్కర్లకు చెల్లించే మొత్తాన్ని రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో ఉంచామని రాహుల్ గాంధీ చెప్పారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Read Also: Anu Jewellers: ప్రగతి నగర్, కూకట్పల్లిలో అను జ్యూవెలర్స్ షోరూం ప్రారంభం..
నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. దేశంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ పొందేలా తాము కొత్త చట్టాన్ని కూడా తీసుకువస్తామని తెలిపారు. ఆ సమయంలో వారికి జీతభత్యం అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయ్యాక మంచి పనితీరు కనబరిస్తే అదే చోట ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
మరోవైపు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలికి, ప్రభుత్వ రంగంలోని 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాకుండా.. రైతులు తమ పంటలకు సరిపడా ఎంఎస్పి వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తుందని, దీని కోసం వారు చాలా కాలంగా ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు.. ఆదివాసీలను తమ భూమి నుంచి నిర్మూలించి.. నీరు, అడవి, భూమిపై వారి మొదటి హక్కులను లాగేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఉద్దేశపూర్వకంగా వారిని ‘ఆదివాసీలు’ అని కాకుండా ‘అటవీవాసులు’ అని పిలుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!