Rahul Gandhi: లోకో పైలట్ల జీవిత రైలు పూర్తిగా పట్టాలు తప్పింది: రాహుల్ గాంధీ
- లోకోపైలెట్లతో రాహుల్ గాంధీ సమావేశం
- వారి సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతానని హామీ
- తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయిన లోకోపైలెట్లు
- తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలకు కారణం తెలిపిన సారథులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోకో పైలెట్ల సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతానని పేర్కొన్నారు.
READ MORE: IND vs ZIM: జింబాబ్వేతో రెండో టీ-20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడిన వీడియోను సోషల్ సైట్లలో షేర్ చేశారు. ఇందులో అతను లోకో పైలట్ల పని తీరును అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా లోకో పైలట్లు తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. వారి పనిగంటలకు పరిమితి లేదు. నరేంద్ర మోదీ హయాంలో లోకో పైలట్ల జీవనం పూర్తిగా పట్టాలు తప్పిందని ఆయన రాశారు. “లోకో పైలట్లు వేడితో ఉడికిపోతున్న క్యాబిన్లలో కూర్చొని ఒక్కొక్కరు 16 గంటలు పని చేయవలసి వస్తుంది. ఎవరి నమ్మకంపై కోట్లాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయో వారికి వారి స్వంత జీవితాలపై నమ్మకం లేదు. మూత్ర విసర్జన వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. లోకో పైలట్లకు పనివేళలపై పరిమితి లేదు. సెలవులు లేవు.. దీంతో వారు శారీరకంగా, మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు.” అని ఆయన రాసుకొచ్చారు.
READ MORE:Bihar: విద్యార్థులు హాజరు కాలేదని..దాదాపు రూ.23లక్షల జీతం తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్..
ఈమేరకు శనివారం రాహుల్ గాంధీకి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ తరపున మెమోరాండం సమర్పించారు. ఇటీవలి రైలు ప్రమాదాలకు పేలవమైన పని పరిస్థితులు కారణమని అందులో పేర్కొన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో రాహుల్ గాంధీ సంభాషణలో ఆర్ కుమారసన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సంభాషణ ద్వారా లోకో పైలట్లు, ప్రయాణికుల సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
नरेंद्र मोदी की सरकार में लोको पायलट्स के जीवन की रेल पूरी तरह पटरी से उतर चुकी है।
गर्मी से खौलते केबिन में बैठ कर लोको पायलट्स 16-16 घंटे काम करने को मजबूर हैं।
जिनके भरोसे करोड़ों ज़िंदगियां चलती हैं, उनकी अपनी ज़िन्दगी का कोई भरोसा नहीं रह गया है।
यूरिनल जैसी बेसिक… pic.twitter.com/nwiG72cBv7
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!