Amritpal Singh: అమృత్పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..
- ఎంపీ అయిన తర్వాత కూడా తీరు మార్చుకోని అమృత్పాల్ సింగ్..
- మళ్లీ ఖలిస్తాన్కి మద్దతుగా కీలక వ్యాఖ్యలు..
- తన తల్లి వ్యాఖ్యల్ని ఖండించిన వేర్పాటువాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాది, ఇటీవల ఎంపీగా గెలిచిన అమృత్పాల్ సింగ్ మరోసారి ‘ఖలిస్తాన్’కి మద్దతుగా మాట్లాడారు. ఇటీవల తన తల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన కొడుకు ఖలిస్తానీ మద్దతుదారు కాదని, అతడిని విడుదల చేయాలని అమృత్పాల్ సింగ్ తల్లి కోరారు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కేసులో, యూఏపీఏ చట్టం కింద అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్పాల్ సింగ్, ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం కోసం నాలుగు రోజుల పెరోల్తో విడుదలయ్యారు.
ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ఆయన తన తల్లి వ్యాఖ్యలపై మాట్లాడారు. ఖలిస్తాన్ డిమాండ్ కోసం మరోసారి నోరు విప్పారు. ‘‘ ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం నేరం కాదు’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘‘ నిన్న మా అమ్మ ఇచ్చిన స్టేట్మెంగ్ గురించి తెలియగానే చాలా బాధపడ్డా.. అనుకోకుండా మా అమ్మ ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్రకటన మా కుటుంబం, లేదా మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాకూడదు’’ అని అన్నారు.
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Also: Nepal: నేపాల్లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..
‘‘ఖల్సా దేశం గురించి కలలు కనడం నేరం కాదు. అది గర్వించదగిన విషయం, లక్షలాది మంది సిక్కుల తమ జీవితాలను త్యగాం చేసిన మార్గం నుంచి వెనక్కి తగ్గడం గురించి మనం కలలో కూడా ఊహించలేము’’ అని అన్నారు. శుక్రవారం అమృత్పాల్ సింగ్తో పాటు ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘ఇంజనీర్ రషీద్’’ అని పిలువబడే షేక్ అబ్దుల్ రషీద్ లోక్సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమృత్ పాల్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నుంచి, రషీద్ జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి గెలుపొందారు.
2023లో అమృత్పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. పలువురు అధికారులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తన అరెస్టైన తన అనుచరుల్ని విడిపించుకు వెళ్లాడు. ఈ ఘటన తర్వాత పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు అమృత్పాల్ సింగ్పై కన్నెర్ర చేశాయి. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే అనుచరుడినని చెప్పుకునే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు నెల రోజుల పాటు వేట సాగించారు. చివరకు పంజాబ్లో మోగాలో గతేడాది అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!