Purandeswari : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని విస్మరించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కేసులో అరబిందో శరత్ చంద్రా రెడ్డి పట్టుబడటం, అరబిందో కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. అభివృద్దిని విస్మరించి ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ ఉన్నారనీ ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని విస్మరించింది కాబట్టే బీజేపీ అభివృద్ది పై దృష్టి పెడుతోందని, అందుకే మోడీ రేపు వస్తున్నారన్నారు పురంధేశ్వరి. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కేసులో పట్టుబడ్డ శరత్ చంద్ర కి ఇక్కడ నేతలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసనీ, విశాఖ లో దస్పల్లా తో పాటు జరిగిన భూ దందాల ఖాతాలన్నింటిపై ఈ డీ కి ఫిర్యాదు చేస్తాం అన్నారు. శరత్ చంద్ర రెడ్డి ఫోన్ లో అన్ని వివరాలు లభ్యం అయ్యాయని అందరి సంగతి తెలుస్తామన్నారు సీఎం రమేష్. ప్రధాని వస్తుంటే వైసీపీ అత్యుత్సాహాన్ని చూస్తుంటే పోలీస్ లను చూసి హడావుడి చేసే వాళ్ళ లా అనిపిస్తోందన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యం లో విశాఖ వచ్చిన బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
Also Read : Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్. భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతున్నారన్నారు. వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారన్నారు. భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ భూకబ్జాయే చేస్తున్నారన్నారు సత్యకుమార్. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగళ కృష్ణ ఎవరు? అతని పై ఎన్ని కేసులున్నాయి? అని ప్రశ్నించారు.
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!